Advertisement

కొంత గ్యాప్ తర్వాత “పుష్ప” సినిమా షూటింగ్ మొదలైంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా మారేడుమిల్లి అడవుల్లో రద్దు అయింది. అక్కడ స్పాట్ లో 20 మందికి కరోనా సోకడంతో షూటింగ్ ని మధ్యలోనే ఆపేసి హైదరాబాద్ వచ్చింది టీం. రెండు వారాల ఐసోలేషన్ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది.

కాచిగూడలోని ఒక పాత భవంతిలో ప్రస్తుతం కొన్ని కీలక సీన్లు తీస్తున్నారు. ఈ నెలాఖరు వరకు హైదరాబాద్ లోనే షూటింగ్ జరిపి మళ్లీ జనవరిలో మారేడుమిల్లి వెళ్లి అక్కడ కీలక ఎపిసోడ్లు చిత్రీకరిస్తారు.

ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ లోపు ఫినిష్ చెయ్యాలని సుకుమార్ కి చెప్పాడట అల్లు అర్జున్. ఎందుకంటే… ఇప్పటికే ఏడాది టైం లాక్డౌన్ కారణంగా వేస్ట్ అయింది. దర్శకుడు కొరటాల శివ సినిమా కూడా జూన్ లేదా జులైలో మొదలుపెట్టాలి.

Advertisement

This post was last modified on December 18, 2020 9:39 am

Advertisement
Share