Advertisement
తెలుగు న్యూస్

రాధేశ్యామ్ షూటింగ్ ఇంకా అయిపోలేదా?


‘రాధే శ్యామ్’ షూటింగ్ పూర్తి అయింది అని పోయిన నెలలో దర్శకుడు ట్వీట్ చేశాడు. ప్రభాస్, ఆ సినిమా టీం షూటింగ్ పూర్తి అయినందుకు పార్టీ చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. గుమ్మడికాయ కొట్టిన తర్వాత మళ్ళీ ఈ సినిమా కోసం సెట్స్ వేస్తున్నారట. అన్నపూర్ణలో సెట్స్ వేసి రెడీగా ఉంచారు. ప్రభాస్, పూజ హెగ్డేలపై తీస్తారు ఈ పాటని.

ఇంతకీ మేటర్ ఏంటంటే… ఒక ”సాంగ్” చిత్రీకరణ మిగిలి ఉందట. నిజానికి ఈ పాట తీసేందుకు యూరోప్ వెళ్ళింది టీం. అక్కడ హీరోయిన్ పూజ హెగ్డే, సినిమాలో కీలకమైన వ్యక్తికీ మధ్య భేదాభిప్రాయాల వల్ల షూటింగ్ రద్దు అయింది. ఇక ఆ పాటని తీయొద్దులే అని ప్రభాస్ టీంకి చెప్పాడట. కానీ ఈ సినిమా హిందీ హక్కులు కొన్న T Series సంస్థ ఆ పాట తీయాలని పట్టుబట్టింది. దాంతో మళ్లీ దాన్నీ హైదరాబాద్ లో సెట్ వేసి తీస్తున్నారు.

అందుకే, షూటింగ్ పూర్తి అయిపోయిందని చెప్పిన తర్వాత మళ్లీ షూటింగ్ చేస్తున్నారు. నాలుగేళ్లుగా సాగుతోంది ఈ సినిమా చిత్రీకరణ. జనవరి 14, 2022న విడుదల కానుంది ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ మొదటి పాట త్వరలోనే యూట్యూబ్ లో విడుదల కానుంది.

Advertisement

This post was last modified on August 20, 2021 3:14 pm

Advertisement
Share