Advertisement
తెలుగు న్యూస్

రజినీకాంత్ చివరి చిత్రం ఇదేనా?

సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎన్నో ఆరోగ్య సమస్యలున్నాయి. వయసు కూడా ఎక్కువే. 70 ప్లస్ వయసులో కూడా రజినీకాంత్ ఇంకా నటిస్తున్నారు. హీరోగానే పలు సినిమాలు చేస్తున్నారు. ఐతే, ఇంకా ఎక్కువ కాలం ఆయన హీరోగా సినిమాలు చెయ్యలేరు. రెస్ట్ కావాలి. అందుకే, చివరి సినిమాని ఒక మంచి డైరెక్టర్ తో చేద్దామని అనుకుంటున్నారట.

రజినీకాంత్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఒక సినిమా తాజాగా ఓకె అయింది. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ వంటి సినిమాలతో లోకేష్ తమిళ సినిమా పరిశ్రమలో నంబర్ వన్ దర్శకుడిగా నిలిచారు. ఆయన ఇప్పుడు విజయ్ హీరోగా ‘లియో’ అనే సినిమా తీస్తున్నారు. ఆ తర్వాత తనతో సినిమా చేయాల్సిందిగా రజినీకాంత్ స్వయంగా పిలిచి అడిగారట. లోకేష్ వెంటనే ఒప్పుకున్నారు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందే చిత్రంతోనే నటనకు గుడ్ బై చెప్పే ఆలోచనలో రజినీకాంత్ ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. అలాగే, తన కూతురు ఐశ్వర్య తీస్తున్న ‘లాల్ సలామ్’ చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. వీటితో పాటు ‘జైభీమ్’ దర్శకుడు తీసే కొత్త చిత్రం కూడా ఓకే చెప్పారు రజినీకాంత్. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ మూవీ ఉంటుంది.

Advertisement

This post was last modified on May 19, 2023 12:31 am

Advertisement
Share