Advertisement
తెలుగు న్యూస్

ఆగిపోయిన రష్మిక హిందీ చిత్రం

రష్మిక మందాన బాలీవుడ్ లో దూసుకెళ్తోంది. ఆమె మొదటి సినిమా ఇంకా విడుదల కాలేదు. కానీ పలు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. అలాగే, టైగర్ ష్రాఫ్ సరసన ఒక మూవీ ఒప్పుకొంది. కానీ ఈ సినిమా మొదలు కాకముందే ఆగిపోయింది.

‘స్క్రూడీలా’ (Screw Dheela) అనే పేరుతో దర్శకుడు శశాంక్ ఖైతాన్ఒ క భారీ చిత్రం ప్లాన్ చేశారు. టైగర్, రష్మిక జంటగా నటిస్తున్నట్లు ఆ సినిమా ప్రకటన కూడా వచ్చింది. ఐతే, నిర్మాత కరణ్ జోహార్ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టాడట. అన్ని లెక్కలు వేసుకొని… ఇది వర్క్ అవుట్ కాదని తేల్చాడట. అలా సినిమా ఆగిపోయింది.

ఈ సినిమా కోసం టైగర్ 35 కోట్ల రూపాయలు అడిగాడట. రష్మిక 4 కోట్లు. మొత్తం బడ్జెట్ 140 కోట్లు అయ్యేలా ఉందట. ఇటీవలే ‘లైగర్’ సినిమాతో దెబ్బతిన్న నిర్మాత కరణ్ జోహార్… బడ్జెట్ విషయంలో ఇక జాగ్రత్తలు పాటించడం మొదలు పెట్టాడట. టైగర్, రష్మిక జంటగా రూపొందే ఈ మూవీకి 140 కోట్లు పెడితే రికవరీ చెయ్యడం సులువు కాదని కరణ్ గ్రహించాడట. ఆడితే, గిట్టుబాటు అవుతుంది. తేడా వస్తే చాలా నష్టం. ఒకవేళ ఫ్లాప్ అయినా నష్టం తక్కువవుండే సినిమాలే కరణ్ చేయాలనుకుంటున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందనేది బాలీవుడ్ మీడియా సమాచారం.

రష్మిక ఖాతాలో మొన్నటివరకు 5 హిందీ చిత్రాలు ఉండేవి. అందులోంచి ఇప్పుడు ఒకటి పోయింది.

Advertisement

This post was last modified on August 29, 2022 5:34 pm

Advertisement
Share