Advertisement
తెలుగు న్యూస్

కరణ్ క్యాంప్ లో రష్మిక

రష్మిక మందాన ఇప్పటికే బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటించింది. ఆ రెండూ ఈ ఏడాదే విడుదల కానున్నాయి. ఐతే, ఈ రెండు చిత్రాలు రిలీజ్ కాకముందే ఆమెతో సినిమా డీల్ పూర్తి చేశాడట ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్.

కరణ్ జోహార్ ‘పుష్ప’ సినిమా చూసి రష్మికకి పెద్ద ఆఫర్ ఇచ్చాడని టాక్. హిందీలో తమ సంస్థ నిర్మించే చిత్రాల్లో ఇక ఆమెకి అవకాశం ఇస్తాడట. అలియా భట్, అనన్య పాండే, జాహ్నవి వంటి హీరోయిన్లు కరణ్ జోహార్ క్యాంప్ లో ఉండి పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఆ క్యాంప్ లోకి రష్మిక చేరిందన్నమాట.

బాలీవుడ్ లో ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకు క్రేజ్ పెరిగింది. సౌత్ స్టార్స్ పాపులర్ అవుతున్నారు. నార్త్ ఇండియాలో తెలుగు నుంచి హిందీకి డబ్బింగ్ అయిన సినిమాలకు బాగా డిమాండ్ ఉంది. ‘పుష్ప’ అనూహ్య విజయంతో దక్షిణాది నటులపై అక్కడి నిర్మాతలకు కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే, కరణ్ జోహార్ రష్మికని ముందే తమ కంపెనీలో సినిమాలు చేసే విధంగా డీల్ కుదుర్చుకున్నట్లు టాక్.

రష్మిక ప్రస్తుతం తెలుగులో శర్వానంద్ సరసన ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు” చిత్రంలో నటిస్తోంది. అలాగే “పుష్ప 2” చేస్తుంది. కొత్త సినిమాలు ఇంకా అనౌన్స్ చెయ్యలేదు.

Advertisement

This post was last modified on January 27, 2022 1:38 pm

Advertisement
Share