Advertisement
తెలుగు న్యూస్

డ్యూటీ ఎక్కనున్న రవితేజ


సాధారణంగా ఒక సినిమా హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా విడుదలైన వారం రోజుల వరకు ప్రచారంతో హంగామా చేస్తుంది టీం. కానీ, రవితేజ మాత్రం ‘ఖిలాడి’ విషయంలో రిలీజ్ ముందే మమ అనిపించేశారనిపిస్తోంది. ‘ఖిలాడి’ సినిమా దారుణ పరాజయం పాలైంది. సినిమాకి రేటింగ్స్, మౌత్ టాక్ కూడా నెగెటివే. దాంతో, టీం ఆశలు వదిలేసుకొంది.

రవితేజకి దర్శకుడు రమేష్ వర్మపై పీకల వరకు కోపముంది. బహుశా సినిమా ఫేట్ రవితేజకి ముందే అర్థమై ఉంటుంది. అందుకే, ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడిపై సెటైర్లు సంధించారు రవితేజ. ఈ సినిమా విషయంలో రవితేజ పబ్లిసిటీని, ప్రమోషన్ ని అస్సలు పట్టించుకోలేదు.

రవితేజ ఇప్పుడు ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాపై ఫోకస్ పెట్టారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయింది. దర్శకుడు శరత్ మండవ తీసిన తీరు, ఆయన కథపై రవితేజ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమా డ్యూటీ ఎక్కనున్నారు రవితేజ. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ మూవీ ఏప్రిల్ 15న విడుదల అవుతుంది.

రవితేజ ఈ ఏడాది మూడు సినిమాలు విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. ‘ఖిలాడి’ ఇప్పటికే విడుదలైంది. ఆ తర్వాత  ‘రామారావు ఆన్ డ్యూటీ’, ఏడాది చివర్లో ‘ధమాకా’ సినిమా వస్తుంది.

Advertisement

This post was last modified on February 16, 2022 2:21 pm

Advertisement
Share