Advertisement
తెలుగు న్యూస్

శిల్ప భర్త కేసు: ఆర్జీవీ మౌనం!


సాధారణంగా ఏదైనా కాంట్రవర్సీ వచ్చిందంటే రామ్ గోపాల్ వర్మ రెచ్చిపోతారు. ఆ ఇష్యూపై వరుసగా ట్వీట్స్ వేసి హడావుడి చెయ్యడం ఆర్జీవీకి అలవాటు. సుశాంత్ సింగ్ రాజపుత్, డ్రగ్స్ కేసుల్లో ఆయన వేసిన ట్వీట్స్ తో ఎంత రచ్చ జరిపారో చూశాం. కానీ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారంలో రామ్ గోపాల్ వర్మ మౌనంగా ఉన్నారు. అసలు స్పందించడం లేదు.

తన భర్త నిర్మించినవి పోర్న్ చిత్రాలు (సెక్స్ సినిమాలు) కాదు అవి ఎరోటికా (శృంగార కథతో తీసిన చిత్రాలు) అని శిల్పాశెట్టి స్టేట్ మెంట్ ఇచ్చింది, సాధారణంగా ఐతే. రామ్ గోపాల్ వర్మ ఈ స్టేట్ మెంట్ పై అనుకూలంగానో, ప్రతికూలంగానో ఒక ప్రకటన ఇవ్వాలి. కానీ ఆయన మౌనం వహిస్తున్నారు. ఎందుకో?

వర్మ ఈ అంశంలో భయపడుతున్నారనే కామెంట్స్ సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ ఆ మధ్య నిర్మించిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా ఎరోటికా కిందకే వస్తాయి. ఐతే, ఆయన సినిమాలపై కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఈ గొడవలో తలదూర్చితే తన సినిమాలపై ఫోకస్ పడుతుందని వర్మ భయపడుతున్నారా అని నెటిజన్స్ “జస్ట్ అస్కింగ్” అన్నమాట.

వర్మ జోరు ఈ మధ్య కొంత తగ్గిందనేది కూడా వాస్తవమే. ఆ మధ్య పరుచూరి మల్లిక్ అనే కెమికల్ ఇంజనీర్ ని గొప్ప మేధావిగా వర్ణించి బోల్తాపడ్డారు. అందుకే, ఇప్పుడు కొంత జాగ్రత్త వహిస్తున్నారు కాబోలు.

Advertisement

This post was last modified on July 25, 2021 7:40 pm

Advertisement
Share