Advertisement
తెలుగు న్యూస్

నా పెళ్ళికి ఇంకా టైముంది: రీతూ

నాగ శౌర్య , రీతూ వర్మ జంటగా రూపొందిన ‘వరుడు కావలెను’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సినిమాలో రీతూ వర్మ భూమి అనే పాత్ర పోషించారు. “ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం కాదు. మంచి ప్రేమకథా చిత్రం. హీరో నాగ శౌర్య, నాకు బలమైన పాత్రలు దక్కాయి. డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య ఈ కథ చెప్పగానే బాగా నచ్చేసింది. హీరోయిన్లకు ఇలాంటి రోల్స్ చాలా రేర్ గా వస్తుంటాయి,” అని తన పాత్ర గురించి చెప్పారు రీతూ.

“పెళ్లి చూపులు చిత్రంలో కూడా నా పాత్ర బలమైన వ్యక్తిత్వంతో కూడుకున్నదే. లక్ష్మీ సౌజన్య అమ్మాయి కాబట్టి ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఈ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నారు. భూమి క్యారెక్టర్ నేను చేసిన మంచి పాత్రల్లో ఒకటిగా నిలిచిపోతుంది.” అని అన్నారు రీతూ.

నాగ శౌర్యతో కెమిస్ట్రీ కూడా కుదిరింది. “మా పెయిర్ వర్కౌట్ అయింది: శౌర్య చాలా డెడికేటెడ్ గా ఉంటాడు. మా పెయిర్ బాగుందని చాలా మంది చెప్తున్నారు.”

ALSO CHECK: Ritu Varma in a blue Saree

‘పెళ్లి చూపులు’, ‘వరుడు కావలెను’ అంటూ సినిమాలు చేస్తున్న రీతూ వర్మ రియల్ లైఫ్ లో పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందట? “దానికి ఇంకా చాలా టైం ఉంది. మరో రెండు మూడేళ్ళు పట్టొచ్చు.” అని క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ భామ ఒక వెబ్ సిరిస్ లో నటిస్తోంది. తెలుగులో మరో చిత్రం ఇంకా సైన్ చెయ్యలేదంట. తమిళంలో ఇంకో మూవీ సెట్స్ పై ఉంది.

Advertisement

This post was last modified on October 26, 2021 11:29 pm

Advertisement
Share