Advertisement
తెలుగు న్యూస్

పిప్రి పిల్లలకు మెహందీ

షూటింగ్ స్పాట్ లో ఖాళీగా ఉండలేదు సాయి పల్లవి. ఆమె ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా పిప్రీ అనే గ్రామంలో షూటింగ్లో పాల్గొంటోంది. శేఖర్ కమ్ముల తీస్తున్న “లవ్ స్టోరీ” షూటింగ్ అక్కడ జరుగుతోంది.

అక్కడ షాట్ గ్యాప్ లో షూటింగ్ చూడ్డానికి వచ్చిన చిన్న పిల్లలందరిని దగ్గరికి పిలిచి వారి చేతులకు మెహందీ పెట్టింది. చాలా ఓపిగ్గా ఆరేడుగురుకి వారి రెండు చేతుల నిండా రకరకాల మెహందీ డిజైన్లు వేసింది. సాయి పల్లవి సింపుల్ అండ్ స్వీట్ హీరోయిన్ అని మరోసారి ప్రూవ్ చేసుకొంది.

ప్రస్తుతం ఆమె తెలుగులో “లవ్ స్టోరీ” తో పాటు రానా హీరోగా రూపొందుతోన్న “విరాటపర్వం”లోను నటిస్తోంది. వచ్చే ఏడాది మరో రెండు సినిమాలు అనౌన్స్ చేస్తుందట.

Advertisement

This post was last modified on October 23, 2020 3:19 pm

Advertisement
Share