Advertisement
తెలుగు న్యూస్

బాలీవుడ్ కోసం చెయ్యక తప్పలేదు


షాలిని పాండే బాగా బరువు తగ్గింది. సైజు జీరో సొగసులు తెచ్చుకొంది. 5 అడుగుల నాలుగు అంగుళాల ఈ సుందరి ఇప్పుడు అల్ట్రా స్లిమ్ గా మారింది. “అర్జున్ రెడ్డి” సినిమాలో చబ్బీగా కనిపించింది. ఐతే, ఆమె ఇప్పుడు రణ్వీర్ సింగ్ సరసన “జయేష్ భాయ్ జోర్దార్” అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి ఆదిత్య చోప్రా నిర్మాత. ఆ నిర్మాత ఏ హీరోయిన్ నైనా బరువు తగ్గాలి అనే కండీషన్ పెడుతారు.

ఆదిత్య చోప్రా చెప్పాడు కాబట్టే ఈ భామ సైజు జీరోకి మారిపోయింది. ఈ సినిమాలో ఆమె డ్యాన్సర్ పాత్ర పోషించింది.

“ప్రత్యేకంగా ఒక డైట్ ప్లాన్ తీసుకున్నాను. అలాగే రోజూ నాలుగు గంటలు డ్యాన్స్ చేశాను. సో… తక్కువ టైంలోనే నేను కావాలనుకున్న బరువు తగ్గాను. పాత్ర కోసం బాడీ మార్చుకునే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు,” అని చెప్తోంది ఈ బ్యూటీ.

తెలుగులో “అర్జున్ రెడ్డి” విడుదలైన తర్వాత “118”, “ఎన్టీఆర్ కథానాయకుడు” “మహానటి”, “ఇద్దరి లోకం ఒకటే”, “నిశ్శబ్దం” వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో మరో మూవీ అంగీకరించలేదు. బాలీవుడ్ లో మాత్రం రెండు పెద్ద సినిమాల్లో నటిస్తోంది.

Advertisement

This post was last modified on August 5, 2021 4:14 pm

Advertisement
Share