Advertisement
తెలుగు న్యూస్

ఘనంగా శంకర్ కూతురి పెళ్లి

ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ రోజు తన కూతురు పెళ్లిని ఘనంగా చేశారు. శంకర్ మొదటి కూతురు ఐశ్వర్య, తమిళనాడు క్రికెట్ లీగ్ కి చెందిన రోహిత్ దామోదరన్ ని పెళ్లాడింది. కరోనా కారణంగా తక్కువ మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం అందింది. ఐతే, పెళ్లి మండపం మాత్రం కళ్ళు చెదిరే విధంగా డిజైన్ చేయించారట శంకర్.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వాదించారు.

కూతురు పెళ్లి వేడుకలు పూర్తి అయిన తర్వాత శంకర్ ఇక తన తదుపరి చిత్రం విషయంలో ఒక నిర్ణయానికి రావొచ్చు. రామ్ చరణ్ తో భారీ చిత్రాన్ని ప్రకటించారు శంకర్. ఐతే, తమ ‘భారతీయుడు 2’ సినిమా పూర్తిచెయ్యకుండా శంకర్ రామ్ చరణ్ సినిమా తీయకూడదని లైకా నిర్మాణ సంస్థ కోర్టుకెక్కింది. మరో రెండు వారాల్లో కోర్టు ఈ కేసులో తుది తీర్పు ఇవ్వనుంది.

Advertisement

This post was last modified on June 27, 2021 5:32 pm

Advertisement
Share