షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కస్టడీ రేపటితో ఎండ్ అవుతుంది. ఐతే, కోర్టు ఆర్యన్ కి బెయిల్ ఇస్తుందా లేక జైలుకి పంపుతుందా అన్నది రేపు తేలుతుంది. పేరొందిన లాయర్ సతీష్ మన్ షిండే ఈ కేసులో ఆర్యన్ తరఫున వాదిస్తున్నారు. ఆర్యన్ మాదకద్రవ్యాలు సేవించినట్లు అధరాలు ఎన్సీబీ చూపించకపోతే బెయిల్ వస్తుంది.
రేపు ఏమవుతుంది అని షారుక్ కుటుంబం మొత్తానికి టెన్షన్. ఈ రాత్రి నిద్రపట్టదు. ఇప్పటికే కొడుకు ఈ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి షారుక్ డీలాపడిపోయారట. తనని వేధించేందుకు తన కొడుకుని బలి చేసినట్లు షారుక్ భావిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గెలుపుని షారుక్ సెలెబ్రేట్ చేసుకున్నారని, ఆమె ప్రధాని అయ్యేందుకు వచ్చే ఎన్నికల్లో షారుక్ ప్లాన్ వేస్తున్నారని బీజేపీ భావిస్తోందట. అందుకే షారుక్ ని టార్గెట్ చేశారనేది ఒక కథనం.
కారణమేదైనా ఎన్సీబీ అధికారులు క్రూయిజ్ షిప్పై దాడి చేసినప్పుడు ఆర్యన్ అక్కడ ఉన్నారు. ఆ దాడిలో అధికారులు అక్కడ నిషేధిత డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఐతే, ఆర్యన్ వాటిని సేవించినట్లు కానీ, లేక అతను కొన్నట్లు కానీ, డీలర్స్ తో పరిచయాలు ఉన్నట్లు కానీ అధికారులు నిరూపించాలి.
సల్మాన్ ఖాన్, ఇతర సెలెబ్రిటీలు షారుక్ కి మద్దతుగా ఉన్నారు. ఐతే, “పెద్దల”తో ‘మాట్లాడి’ ఆర్యన్ ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు సఫలం అవుతాయా?
This post was last modified on October 6, 2021 7:24 pm