Advertisement
తెలుగు న్యూస్

తెలుగోళ్లకు నేను సొంతం: పూజ


హీరోలందరూ ‘పాన్ ఇండియా’ జపం చేస్తున్నారు. కానీ ఒకరిద్దరికి తప్ప దక్షిణాది హీరోలెవ్వరికి దేశమంతా క్రేజ్, పాపులారిటీ లేదు. ఇక, మన తెలుగు హీరోయిన్లలో అలాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఒకే ఒక్క భామ… పూజ హెగ్డే. కానీ, ఆమె మాత్రం తాను తెలుగోళ్ళకి సొంతం అని చెప్తోంది.

ఆమె తల్లితండ్రులు కన్నడిగులు. పూజ పుట్టింది, పెరిగింది ముంబైలో. ఐతే, ఆమెకి స్టార్ డం ఇచ్చిన ప్రేక్షకులు మాత్రం తెలుగువారే. అందుకే, తాను తెలుగు సినిమాకే రుణపడి ఉంటాను అని చెప్తోంది పూజ.

“నేను ఆలిండియా స్టార్ కావాలని అనుకున్నాను. తెలుగులో ముందు పేరు వచ్చింది. ఇప్పుడు తమిళ, హిందీ సినిమాలు కూడా చేస్తున్నాను. ఆ కల నెరవేరుతోంది,” అని చెప్తోంది ఈ బ్యూటీ.

ఆమె తెలుగులో ‘రాధేశ్యామ్’, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ఆచార్య’ సినిమాల్లో నటించింది. ఇవన్నీ వచ్చే ఐదారు నెలల్లో విడుదలవుతాయి. తమిళంలో విజయ్ సరసన ‘బీస్ట్’ అనే మూవీ చేస్తోంది. హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ఒకటి, రణ్వీర్ సింగ్ సరసన మరోటి ఆమె ఖాతాలో ఉన్నాయి.

Advertisement

This post was last modified on August 5, 2021 10:13 pm

Advertisement
Share