Advertisement
తెలుగు న్యూస్

ఫైనల్ గా శివసేనలో చేరిన ఊర్మిళ

‘రంగీలా’ హీరోయిన్ ఊర్మిళా మటోండ్కర్ శివసేనలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సమక్షంలో ఆమె ఈ రోజు శివసేన కండువా వేసుకున్నారు. ఆమెని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేసేందుకు ఠాక్రే అంగీకరించినట్లు సమాచారం.

గత లోక్ సభ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఐతే, సొంత పార్టీ నేతలే తనకి వ్యతిరేకంగా పనిచేసారని ఆరోపిస్తూ ఆమె గతేడాది కాంగ్రెస్ కి రాజీనామా చేశారు.

ఇటీవల కంగనా రనౌత్ …ఠాక్రే ప్రభుత్వంకి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించినప్పుడు ఊర్మిళ స్పందించారు. కంగనాకి గట్టిగా సమాధానం ఇవ్వడంలో ఊర్మిళ సక్సెస్ అయిందనే చెప్పాలి. అందుకే ఠాక్రే ఆమెని పార్టీలోకి వెల్కమ్ చెప్పారట.

Advertisement

This post was last modified on December 1, 2020 10:05 pm

Advertisement
Share