దర్శకుడు వెంకీ కుడుములని ఒకతను మోసం చేశాడన్న వార్త నిజమే. ఇప్పటికే తెలుగుసినిమా.కామ్ ఈ వార్తను ప్రచురించింది. ‘చలో’, ‘భీష్మ’ వంటి సినిమాలు తీసి ఇప్పుడు మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోలతో చేద్దామని ఉబలాటపడుతున్న ఈ దర్శకుడు అంతా సిల్లీగా ఒకడి అకౌంట్ లో 60 వేలు ఎలా వేశాడు అనేదే అందరి డౌట్.
దానికి వెంకీ కుడుముల ఇప్పుడు సమాధానం ఇచ్చ్చాడు. జరిగింది ఇది అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.
ఇది వెంకీ కుడుముల మోసపోయిన తీరు. చాలామంది మిత్రులు సైలెంట్ గా ఉండమని చెప్పారట. కానీ ఇది అందరికి తెలిస్తే… మోసం చేసేవాళ్ళు ఎలా ఉంటారో మిగతావాళ్ళకి కూడా తెలుస్తుందని తానే కేసు వేసినట్లు చెప్పుకొచ్చాడు.
కానీ వెంకీ కుడుముల చెప్తున్న వాటిలో కూడా కొన్ని లాజిక్కు లు మిస్ అయ్యాయి. జనం ట్రోలింగ్ చేస్తున్నారని వివరణ ఇచ్చినట్లుగా ఉంది.
This post was last modified on March 4, 2021 4:59 pm