Advertisement
తెలుగు న్యూస్

నాగ్ అశ్విన్ సినిమా వెనక్కి!

ప్రభాస్ హీరోగా మరో సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రభాస్ లేటెస్ట్ గా “సలార్” అనే సినిమా అనౌన్స్ చేశాడు. KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి డైరెక్షన్. హోంబాలే ఫిలిమ్స్ (KGF నిర్మాతలు) నిర్మిస్తుంది. జనవరిలోనే షూటింగ్ ప్రారంభం అని ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టాడు.

విచిత్రం ఏమిటంటే… దీనికన్నా ముందే ఓం రౌత్ డైరెక్షన్ లో “ఆదిపురుష్” సినిమా అనౌన్స్ చేశాడు ప్రభాస్. అప్పుడు ప్రకటించినప్పుడు కూడా “ఆదిపురుష్” జనవరి 2021లో ప్రారంభం అవుతుంది అని చెప్పారు. ఈ రెండు సినిమాల కన్నా ముందు “మహానటి” దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్క్షన్ లో సైన్స్ ఫిక్షన్ మూవీ ఉంటుందని చెప్పాడు. అమితాబ్, దీపికాని తీసుకున్నారు కూడా.

కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం నాగ్ అశ్విన్ మూవీ వెనెక్కి వెళ్ళింది. ఇప్పట్లో అది మొదలవ్వదు. ముందుగా “సలార్” మొదలుపెట్టి 2021లోనే రిలీజ్ చేస్తాడు. అలాగే 2022 ఆగస్టులో “ఆదిపురుష్” వస్తుంది. 2023లో నాగ్ అశ్విన్ సినిమా రిలీజ్ అయ్యేలా ఉంది.

అంటే మహానటి దర్శకుడు సినిమాని పూర్తిగా వెనక్కి వెళ్ళింది. దానికి కారణం, గ్రాఫిక్స్, ప్రీ-ప్రొడక్షన్ పనులే.

Advertisement

This post was last modified on December 2, 2020 3:52 pm

Advertisement
Share