Advertisement
తెలుగు న్యూస్

శృతికి రెండోసారి ‘లాభం’ వస్తుందా?


కరోనా మొదటి వేవ్ తర్వాత ఎక్కువ లాభపడిన నటి… శృతి హాసన్. అంతకుముందు ఆమెకి ఫ్లాపులున్నాయి. పైగా చాలా గ్యాప్ వచ్చింది. కానీ, కరోనా మొదటి సంక్షోభం తర్వాత విడుదలై పెద్ద విజయం సాధించిన మొదటి చిత్రం ఆమెదే కావడం విశేషం. ఆ సినిమా… క్రాక్. “క్రాక్”లో రవితేజ హీరో, శృతి హాసన్ హీరోయిన్. ఆ తర్వాత మూడు నెలలకే పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ వచ్చింది. అది కూడా ఆడింది. అంటే తక్కువ గ్యాప్ లో రెండు విజయాలు అందుకొంది.

“క్రాక్” విజయం తర్వాత ఆమెకి ఏకంగా ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న ‘సలార్’ సినిమాలో ఆమె హీరోయిన్. ఒక్కసారిగా ఆమె కెరీర్ మళ్ళీ ట్రాక్ లో పడింది టాలీవుడ్ లో.

ఇప్పుడు రెండో వేవ్ తర్వాత మళ్ళీ థియేటర్ల ముందుకు కొత్త సినిమాలు క్యూ కడుతున్నాయి. తెలుగులో ఇప్పటికే అనేక చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ తమిళనాడులో మాత్రం మొదటి సినిమాగా విజయ్ సేతుపతి, శృతి హాసన్ జంటగా నటించిన ‘లాభం’ అనే సినిమా విడుదల కానుంది. అంటే రెండో వేవ్ తర్వాత మళ్ళీ శృతికి అదృష్టం పట్టేలా ఉంది.

ఆరు నెలలుగా తమిళనాడులో సినిమాలు విడుదల కావట్లేదు. జనం వెయిట్ చేస్తున్నారు. సో.. “లాభం” సినిమాని తమిళ ప్రేక్షకులు హిట్ చేస్తే ఆమెకి అక్కడ దశ తిరుగుతుంది. మొదటి వేవ్ లో తెలుగులో విజయం దక్కినట్లు రెండో వేవ్ తర్వాత తమిళనాడులో ఆమెకి హిట్ బోణి దక్కుతుందా అన్నది చూడాలి.

శృతి హాసన్ ప్రస్తుతం హజారికా అనే చిత్రకారుడితో సహజీవనం చేస్తోంది. ముంబైలో ఇల్లు కొనుక్కొని ఈ బాయ్ ఫ్రెండ్ తో కలిసి జీవిస్తోంది. అలాగే కెరీర్ పై మళ్ళీ ఫోకస్ పెట్టింది.

Advertisement

This post was last modified on August 25, 2021 7:14 pm

Advertisement
Share