మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ … ఒక టైంలో తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలుగా నిలిచారు. 1980 చివర్లో, 1990లలో వీరే టాప్ హీరోస్. ఒకరికొకరు పోటీ పడేవారు తమ చిత్రాలతో. ఐతే, ఇప్పుడు అందరూ జీవితంలో తాతలు అయ్యారు, కెరీర్ లో సీనియర్ సిటిజెన్ స్టార్స్ గా మారారు. అందుకే ఇప్పుడు ఒకరితో కలిసి ఒకరు నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
త్వరలోనే వెంకటేష్ నాలుగు సినిమాల్లో నటిస్తారు. అందులో రెండు చిత్రాలు చిరంజీవి, బాలయ్యలతో.
ప్రస్తుతం చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి ఒక సినిమా డైరెక్ట్ చేస్తుండగా, ఆ సినిమాలో వెంకటేష్ కి ఒక కీలక పాత్ర ఉంది. చిరంజీవితో ఉన్న స్నేహం, అనిల్ రావిపూడితో ఉన్న అనుబంధం కారణంగా వెంకటేష్ ఇందులో దర్శనమివ్వబోతున్నారు. ఇక బాలయ్యతో కూడా ఒక సినిమా చెయ్యబోతున్నట్లు తెలిపారు వెంకటేష్.
నాగార్జున మినహా మిగతా ఇద్దరితో వెంకీ సినిమాలు చేస్తున్నారు. నాగార్జునతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ ముచ్చటా తీరుతుంది.
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…
మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…
మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…
ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…
ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…