నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేశ్ (Bandla Ganesh) సంచలన ప్రకటన చేశారు. కొన్నాళ్లుగా ఆయన బ్యానర్ స్తబ్దుగా ఉన్న సంగతి తెలిసిందే. అలా స్తబ్దుగా ఉన్న ‘పరమేశ్వర ఆర్ట్స్’ (Parameswara Arts) బ్యానర్ ను మూసేస్తానంటూ ప్రకటించారు బండ్ల. అయితే దానికి ఆయన ఒక కండిషన్ పెట్టారు.
“పవన్ కల్యాణ్ తో ఇంకొక్క సినిమా చేయాలి. ఆ ఒక్క సినిమా చేసి నా బ్యానర్ ఆపేస్తాను. ఆ సినిమా ఎలా ఉండాలంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు షాక్ అవ్వాలి. ఏం సినిమా తీసావయ్యా అని చెప్పుకోవాలి. ‘గబ్బర్ సింగ్’ సినిమాను ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. అలా పవన్ తో సినిమా చేస్తే మరో పాతికేళ్లు చెప్పుకునేలా సినిమా తీయాలి”
ఇది బండ్ల గణేశ్ కోరిక. అయితే అలా తీయాలంటే సరైన కథ దొరకడం లేదంటున్నాడు ఈ నిర్మాత. గతంలో ‘టెంపర్’ కథ విన్నప్పుడు ఎంత ఎక్సయిట్ అయ్యానో, అలాంటి కిక్ ఇచ్చే కథలు దొరకడం లేదంటున్నాడు.
ఈ గ్యాప్ లో ఈయన మరో చిన్న బ్యానర్ స్థాపించాడు. ఈటీవీ విన్ తో కలిసి సంయుక్తంగా సినిమాలు, ఓటీటీ ఒరిజినల్స్ నిర్మిస్తున్నారు. తన కూతురు పేరిట ఆ బ్యానర్ స్థాపించానని, అది 4-5 కోట్ల రూపాయల చిన్న ప్రొడక్షన్ కే పరిమితమని క్లారిటీ ఇచ్చారు.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…