మహా కుంభమేలాలో ఒక అమ్మాయి అందం అందరినీ ఆకర్శించింది. మోనాలిసా అనే ఒక సాధారణ యువతి ఆమె సహజ సౌందర్యంతో సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. దాంతో, ఆమెని ఉదహరిస్తూ కంగనా రనౌత్ పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం బాలీవుడ్ లోనూ, ఇతర సినిమా ఇండస్ట్రీలోనూ “తెల్ల పిల్ల”కు ఉన్న క్రేజ్ సహజ భారతీయ రంగుతో కూడిన హీరోయిన్లకు లేదు అని ఆమె మండిపడింది. ఒకప్పుడు కాజోల్, బిపాసా బసు, దీపిక పదుకోన్ తమ ఛామన ఛాయ సౌందర్యంతో కుర్రకారును ఆకర్శించారు. కానీ ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ భామలకే క్రేజ్ ఉంది.
“తన సహజ సౌందర్యంతో మోనాలిసా ఇంటర్నెట్ సెన్సేషన్గా మారింది. ఫోటోలు, ఇంటర్వ్యూల కోసం ఆమెను వేధించడం నాకు నచ్చలేదు కానీ ఆమె పాపులారిటీ నాలో కొత్త ప్రశ్నని తీసుకొచ్చింది? ప్రస్తుతం గ్లామర్ ప్రపంచంలో భారతీయ రంగుకి ప్రాతినిధ్యం వహించే హీరోయిన్లు ఉన్నారా అనే ప్రశ్న అడగలేకుండా ఉన్నాను. అను అగర్వాల్, కాజోల్, బిపాషా, దీపిక, రాణి ముఖర్జీని ఇష్టపడినంతగా నేటితరం ప్రజలు ఇష్టపడుతున్నారా?,” అని కంగనా పోస్ట్ చేసింది.
ఇప్పుడు భారతీయ సినిమాల్లో మన “రంగు” ఉన్న హీరోయిన్లు కావాలి, రావాలి అని ఆమె పేర్కొంది.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…