మహా కుంభమేలాలో ఒక అమ్మాయి అందం అందరినీ ఆకర్శించింది. మోనాలిసా అనే ఒక సాధారణ యువతి ఆమె సహజ సౌందర్యంతో సోషల్ మీడియా సెన్సేషన్ అయింది. దాంతో, ఆమెని ఉదహరిస్తూ కంగనా రనౌత్ పోస్ట్ పెట్టింది.
ప్రస్తుతం బాలీవుడ్ లోనూ, ఇతర సినిమా ఇండస్ట్రీలోనూ “తెల్ల పిల్ల”కు ఉన్న క్రేజ్ సహజ భారతీయ రంగుతో కూడిన హీరోయిన్లకు లేదు అని ఆమె మండిపడింది. ఒకప్పుడు కాజోల్, బిపాసా బసు, దీపిక పదుకోన్ తమ ఛామన ఛాయ సౌందర్యంతో కుర్రకారును ఆకర్శించారు. కానీ ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ భామలకే క్రేజ్ ఉంది.
“తన సహజ సౌందర్యంతో మోనాలిసా ఇంటర్నెట్ సెన్సేషన్గా మారింది. ఫోటోలు, ఇంటర్వ్యూల కోసం ఆమెను వేధించడం నాకు నచ్చలేదు కానీ ఆమె పాపులారిటీ నాలో కొత్త ప్రశ్నని తీసుకొచ్చింది? ప్రస్తుతం గ్లామర్ ప్రపంచంలో భారతీయ రంగుకి ప్రాతినిధ్యం వహించే హీరోయిన్లు ఉన్నారా అనే ప్రశ్న అడగలేకుండా ఉన్నాను. అను అగర్వాల్, కాజోల్, బిపాషా, దీపిక, రాణి ముఖర్జీని ఇష్టపడినంతగా నేటితరం ప్రజలు ఇష్టపడుతున్నారా?,” అని కంగనా పోస్ట్ చేసింది.
ఇప్పుడు భారతీయ సినిమాల్లో మన “రంగు” ఉన్న హీరోయిన్లు కావాలి, రావాలి అని ఆమె పేర్కొంది.
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…