ఒకప్పుడు మోహన్ బాబు అంటే అందరికీ హడల్. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా భయపడేది…. ఆయన మాటకి, ఆయన చేష్టలకి. ఇప్పుడు మోహన్ బాబు తన కొడుకులకే భయపడుతున్నారు. ఒకప్పుడు ప్రభుత్వాలను కూడా గద్దించేవారు. ఇప్పుడు పోలీసులు తనని అరెస్ట్ చేస్తారేమో అని ఆయనే భయపడుతున్నారు.
కాలం, వయసు అన్నింటిని తలకిందులు చేశాయి. అంతకన్నా ముఖ్యంగా సన్ స్ట్రోక్ బాగా తగిలింది మోహన్ బాబుకు. అందుకే ఇప్పుడు పూర్తిగా వేదాంతం పలుకుతున్నారు.
మోహన్ బాబు తాజా ఇంటర్వ్యూలో తన కుటుంబ గొడవల ప్రస్తావన తేకుండా ఒక మాట చెప్పారు. “అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడూ చెప్తుండేవారు… పిల్లలను కనగలం కానీ వారి తలరాతలను కనలేం అనేవారు. ఆ మాట ఇప్పుడు నిజం అనిపిస్తోంది.” ఇది మోహన్ బాబు పలుకు. చిన్న కొడుకు మనోజ్ చేసిన గొడవ, పెద్ద కొడుకు విష్ణు పట్టింపులతో మోహన్ బాబుకి వేదాంతం వచ్చేసింది.
ఇక ఇటీవల జరుగుతున్న ట్రోలింగ్ గురించి కూడా మాట్లాడారు. ఎవరినీ నిందించను అని ముగించారు.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…