చాలామంది డాక్టర్ అవ్వాలనుకొని యాక్టర్ అయ్యానని చెబుతుంటారు. కానీ హీరోయిన్ మీనాక్షి చౌదరి మాత్రం డాక్టర్ అయిన తర్వాత యాక్టర్ గా మారింది. అవును.. మీనాక్షి చౌదరి డెంటిస్ట్, ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఆ తర్వాత విధి ఆమెను గ్లామర్ ప్రపంచంలోకి లాక్కొచ్చింది.
డెంటిస్ట్ గా పనిచేస్తున్న టైమ్ లోనే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది మీనాక్షి. అందులో తన లుక్స్ తో చాలామందిని ఆకర్షించింది. అప్పుడే ఆమెకు తనపై మరింత నమ్మకం పెరిగింది. దీంతో ముంబయిలో యాక్టింగ్ వర్క్ షాప్స్ లో జాయిన్ అయింది. అక్కడే సుశాంత్ తో పరిచయమైంది. ఆమె లుక్స్ నచ్చి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు సుశాంత్.
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో హీరోయిన్ గా మారిన మీనాక్షి.. ఆ సినిమా రిజల్ట్ తేడాకొట్టినా తను మాత్రం హిట్టయింది. బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంది. ఏకంగా మహేష్, కోలీవుడ్ స్టార్ విజయ్ లాంటి హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది.ప్రస్తుతం వరుస అవకాశాలతో టాలీవుడ్ లో పాతుకుపోతోంది.
డెంటిస్ట్ జాబ్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన మీనాక్షి.. ఇదంతా విధి విచిత్రం అంటోంది. ఇంతలా తన జీవితం మారిపోతుంది అని అనుకోలేదట. ఆమె నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. ఇక విడుదలకు సిద్ధంగా ఉన్నాయి – మట్కా, మెకానికి రాకీ.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…