సంతోషంతో కూడిన డైలమా ఇది. ఓవైపు నిర్మాతగా సక్సెస్ అయింది నిహారిక. మరోవైపు ఆమె హీరోయిన్ గా రీఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆమె నిర్మాతగా కొనసాగాలా లేక హీరోయిన్ గా తిరిగి కెరీర్ మొదలుపెట్టాలా అనే డైలమాలో పడింది.
నిర్మాతగా మారి తొలిసారి “కమిటీ కుర్రోళ్లు” సినిమాను నిర్మించింది నిహారిక. ఈ సినిమాకు అన్నీ తానై ప్రచారం చేసింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకు స్టార్ ఎట్రాక్షన్ నిహారిక మాత్రమే. అందుకే బాగా కష్టపడింది. ఆమె కష్టానికి ఫలితం దక్కింది. “కమిటీ కుర్రోళ్లు” మంచి విజయం సాధించింది.
ఈ సినిమా విడుదలకు ముందే ఆమె హీరోయిన్ గా కెరీర్ ను రీస్టార్ట్ చేసింది. ఆల్రెడీ మంచు మనోజ్ సినిమాలో నటిస్తోంది. తాజాగా మరో సినిమాకు సైన్ చేసింది.
“కమిటీ కుర్రోళ్లు” సక్సెస్ తో నిహారిక ఇప్పుడు డైలమాలో పడినట్లే అనే మాట వినిపిస్తోంది.
హీరోయిన్ గా కొనసాగాలా, లేక నిర్మాతగా మరో సినిమా నిర్మించాలా అని ఆలోచిస్తోంది. రెండూ చేయొచ్చు కదా అనే అనుమానం రావొచ్చు. కానీ ఈరోజుల్లో రెండూ నిర్వహించడం చాలా కష్టమైన పని. ఒక చోట నిర్మాతగా డబ్బులు పెట్టి, మరో చోటుకు వెళ్లి హీరోయిన్ గా నటించడం అనేది చాలా ఇబ్బందికరం. ఐతే, ఇప్పుడు కెరీర్ పైనే దృష్టి నిలిపింది. డివోర్స్ తీసుకున్నాక ఆమె పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టింది కొంచెం కష్టం అయినా అటు నిర్మాతగానూ , ఇటు హీరోయిన్ గానూ కొనసాగుతుంది అని చెప్పొచ్చు.
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…
ఒక నటిగా కెరీర్లో ఎదురయ్యే ఒడిదొడుకులు, కష్టకాలమే ఓపికను, తనపై తనకు నమ్మకాన్ని నేర్పించిందని చెబుతోంది హీరోయిన్ త్రిప్తి దిమ్రి…
కొందరికి అదృష్టం అలా పట్టేస్తుందంతే. రావడమే హిట్లు మీద హిట్లు కొడతారు, వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ కెరీర్ లో…