త్వరలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సెట్స్ పైకి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా షూటింగ్ అప్ డేట్స్ బయటకొచ్చాయి. నవంబర్ నెలాఖరు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది.
మైసూర్ లో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. నిజానికి హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ అనుకున్నారు. కానీ సెట్ అందుబాటులోకి రాలేదు. అందుకే మైసూర్ లో 2 వారాల షెడ్యూల్ పూర్తిచేసి, ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్న భారీ సెట్ లోకి షిఫ్ట్ అవుతారు.
సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం ఈ సెట్ లోనే ఉంటుంది. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించబోతోంది. ఆమె ఫస్ట్ షెడ్యూల్ లో జాయిన్ అవుతుందా అవ్వదా అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే 3 పాటల కంపోజిషన్ పూర్తిచేశాడు కూడా. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు నుంచి వస్తున్న సినిమా ఇదే. చరణ్, బుచ్చిబాబు సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారు. దాదాపుగా ఇదే టైటిల్ ఫిక్స్.
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…
'పెద్ది' (Peddi) సినిమా వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ జాన్వి కపూర్ (Janhvi Kapoor)ను అక్కడక్కడ అభ్యంతరకరంగా…
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…