త్వరలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సెట్స్ పైకి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా షూటింగ్ అప్ డేట్స్ బయటకొచ్చాయి. నవంబర్ నెలాఖరు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది.
మైసూర్ లో ఫస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. నిజానికి హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ అనుకున్నారు. కానీ సెట్ అందుబాటులోకి రాలేదు. అందుకే మైసూర్ లో 2 వారాల షెడ్యూల్ పూర్తిచేసి, ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తున్న భారీ సెట్ లోకి షిఫ్ట్ అవుతారు.
సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ మొత్తం ఈ సెట్ లోనే ఉంటుంది. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించబోతోంది. ఆమె ఫస్ట్ షెడ్యూల్ లో జాయిన్ అవుతుందా అవ్వదా అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే 3 పాటల కంపోజిషన్ పూర్తిచేశాడు కూడా. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు నుంచి వస్తున్న సినిమా ఇదే. చరణ్, బుచ్చిబాబు సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్ అనుకుంటున్నారు. దాదాపుగా ఇదే టైటిల్ ఫిక్స్.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…