బాలీవుడ్ భామ ఆలియా భట్ కి తెలుగు వారితో ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. ఆమె “బ్రహ్మస్త్ర” సినిమా నుంచి వరుసగా తన సినిమాలను తెలుగులో విడుదల చేస్తోంది. రాజమౌళి తీసిన “ఆర్ ఆర్ ఆర్”లో కూడా నటించింది. ఇప్పుడు ఆమె నటించిన ‘జిగ్రా’ చిత్రం తెలుగులో అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చింది ఆలియా. ఈ ఈవెంట్ కి రానా, త్రివిక్రమ్, సమంత అతిథులుగా వచ్చారు.
“నేను మెసెజ్ చేసిన వెంటనే వచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. మీరు మాట్లాడిన ప్రతీ మాట గుండెల్ని తాకింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్లో సమంత రియల్ హీరో. సమంత తన నటనతో సినిమా పరిశ్రమలో నిలబడ్డారు. సమంతకు, నాకు సరిపోయే కథను త్రివిక్రమ్ రాస్తే బాగుంటుందనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఈ చిత్రంతో వస్తున్నాను. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులతో కనెక్షన్ ఏర్పడింది,” అని చెప్పింది ఆలియా
“నాటు నాటు పాటను నా కూతురు రాహా ఎప్పుడూ వింటూనే ఉంటుంది. మంచి చిత్రాన్ని ప్రేమించడం, ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అందుకే నా గంగూభాయ్, బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో రిలీజ్ చేశాం.”
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…
'పెద్ది' (Peddi) సినిమా వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ జాన్వి కపూర్ (Janhvi Kapoor)ను అక్కడక్కడ అభ్యంతరకరంగా…
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…