తమ సినిమాకు బజ్ తీసుకొచ్చేందుకు మేకర్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. టికెట్ కొనుగోలుపై ఫారిన్ ట్రిప్ కు వెళ్లే అవకాశం అంటుంటారు. ఇవి కాకుండా.. బై వన్ గెట్ వన్ ఆఫర్లు కూడా పెడుతుంటారు. ఇది కూడా అలాంటిదే.
సాయిరాం శంకర్ కొత్త సినిమా పేరు ‘ఒక పథకం ప్రకారం’. ఫిబ్రవరి 7న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాకు ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు డిఫరెంట్ కాంటెస్ట్ పెట్టారు.
7వ తేదీన 50 ప్రధాన కేంద్రాల్లో ఈ సినిమా మార్నింగ్ షో చూడాలి. ఇంటర్వెల్ ఇచ్చేసరికి సినిమాలో విలన్ ఎవరో చెప్పాలి. 50 థియేటర్లలో బయట కూపన్లు, డబ్బా ఉంటాయి. కూపన్ లో విలన్ పేరు, మీ మొబైల్ నంబర్ రాసి డబ్బాలో వేయాలి.
కరెక్ట్ గా విలన్ ను గెస్ చేస్తే, 10వేల రూపాయల బహుమతి అందిస్తారు. ఇదేదో మొత్తంగా లక్కీ డ్రా తీసి ఇచ్చే బహుమతి కాదు. ప్రతి థియేటర్ కు ఒక్కర్ని ఎంపిక చేసి బహుమతి అందిస్తారు. అంటే.. 50 థియేటర్లలో 50 మంది ఈ బహుమతి గెలుచుకునే అవకాశం అన్నమాట.
వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతూ, లాంగ్ గ్యాప్ తీసుకొని, ఎట్టకేలకు ‘ఒక పథకం ప్రకారం’ సినిమాతో థియేటర్లలోకి వస్తున్న సాయిరాం శంకర్ కు, ఈ కాంటెస్ట్ ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…