తెలుగు అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్రాజు తన సహృదయతను చాటుకున్నారు. అనాథలైన ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు.
యాదాద్రి జిల్లా ఆత్మకూరు గ్రామంలో గట్టు సత్తయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. భర్తపై బెంగతో భార్య అనురాధ కూడా రెండు రోజుల క్రితం కన్నుమూశారు. తల్లిదండ్రుల మరణంతో పిల్లలు మనోహర్, లాస్య, యశ్వంత్ అనాథలయ్యారు. ఈ విషయాన్ని ఓ ఛానెల్ ద్వారా తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, సదరు గ్రామ సర్పంచు, ఎమ్మెల్యేతో ఫోన్లో ప్రత్యేకంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఆ పిల్లలను దత్తత తీసుకోవాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఫోన్ చేసి కోరారు. మంత్రి ఎర్రబెల్లి కోరడంతో ఆ పిల్లలను దత్తత తీసుకుంటానని మాటిచ్చారు దిల్రాజు. తన కుటుంబం స్థాపించిన ‘మా పల్లె’ చారిట్రబుల్ ట్రస్ట్ ద్వారా పిల్లలను బాగోగులును చూసుకుంటానని దిల్రాజు ఈ సందర్భంగా తెలియజేశారు. అడగ్గానే అనాథ పిల్లలను దత్తత తీసుకున్న నిర్మాత దిల్ రాజుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు.
హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) తెగ హడావిడి చేస్తోంది. సినిమాకి ఎంత ప్రచారం చెయ్యాలన్నా చేస్తాను అన్నట్లు "నాగబంధం"…
ఈ దసరా పండక్కి (Dasara 2026) రెండు పెద్ద సినిమాలు పోటీ పడేలా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాకి అధికారికంగా…
మాళవిక మోహనన్ అంటేనే గ్లామర్ షో అని చెప్పాలి. ఆమె అందాల ఆరబోతలో అస్సలు సిగ్గుపడదు. ఇక ఇప్పుడు మాల్దీవుల్లో…
ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…