లాక్ డౌన్ వల్ల థియేటర్లలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ ముందుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. తర్వాత టీవీల్లో ప్రసారం అవుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఇలా ఓటీటీల్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే రీసెంట్ గా విడుదలైన తెలుగు సినిమాల్లో అంతోఇంతో ఆదరణ దక్కించుకున్న సినిమా “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య”. దీంతో సహజంగానే ఈ సినిమా పైరసీకి గురైంది.
ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ఈటీవీ గ్రూప్ దక్కించుకుంది. తమ సినిమా పైరసీ అయిందని గ్రహించిన వెంటనే ఆ ఛానెల్ రంగంలోకి దిగింది. “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” శాటిలైట్ రైట్స్ ను తమ సంస్థ దక్కించుకుందని, ఎవరైనా కేబుల్ లో దీన్ని ప్రసారం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ప్రకటన ఇచ్చింది.
నిజానికి ఉన్నఫలంగా ఈటీవీ ఇలా స్టేట్ మెంట్ ఇవ్వడానికి ఓ కారణం ఉంది. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో లోకల్ కేబుల్ టీవీ ఆపరేటర్లు ఈ సినిమాను ఆల్రెడీ ప్రసారం చేసేశారు. ఇదే కాదు, ఇంతకుముందు ఓటీటీలో ప్రసారమైన తెలుగు సినిమాలన్నీ ఆల్రెడీ లోకల్ సిటీకేబుల్ ద్వారా టీవీల్లో వచ్చేశాయి. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఈటీవీ యాజమాన్యం ఇలా పత్రికా ప్రకటన జారీచేసింది.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…