ముందు జ్యోతిక అన్నారు. ఆ తర్వాత సిమ్రాన్ పేరు తెరపైకొచ్చింది. ఇప్పుడేమో కియరా అద్వానీ పేరు ప్రచారంలోకి తెచ్చారు. “చంద్రముఖి” సీక్వెల్ కు సంబంధించి ఇలా రోజుకో పేరు వినిపిస్తోంది. లారెన్స్ హీరోగా రాబోతున్న ఈ ప్రెస్టీజియస్ సీక్వెల్ కు సంబంధించి చిన్నపాటి క్లారిటీ వచ్చింది. అది కూడా లారెన్స్ నుంచే.
తన సినిమాలో ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు లారెన్స్. మరీ ముఖ్యంగా అందరూ చెబుతున్నట్టు జ్యోతిక, సిమ్రాన్, కియరా అద్వానీలో ఏ ఒక్కరు లాక్ అవ్వలేదని స్పష్టంచేశాడు. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత సినిమాలో హీరోయిన్ ఎవరనేది చెప్తాడట.
పి.వాసు దర్శకత్వంలో రాబోతున్న ఈ సీక్వెల్ పనులు ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయని ప్రకటించాడు లారెన్స్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రాబోతోంది ఈ మూవీ.
హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) తెగ హడావిడి చేస్తోంది. సినిమాకి ఎంత ప్రచారం చెయ్యాలన్నా చేస్తాను అన్నట్లు "నాగబంధం"…
ఈ దసరా పండక్కి (Dasara 2026) రెండు పెద్ద సినిమాలు పోటీ పడేలా ఉన్నాయి. ఒక పెద్ద సినిమాకి అధికారికంగా…
మాళవిక మోహనన్ అంటేనే గ్లామర్ షో అని చెప్పాలి. ఆమె అందాల ఆరబోతలో అస్సలు సిగ్గుపడదు. ఇక ఇప్పుడు మాల్దీవుల్లో…
ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…