జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ హీరోయిన్ గా ఇప్పటికే పరిచయం అయింది. ఐతే, ఖుషి కపూర్ ఇంకా తెలుగులో కానీ, తమిళంలో కానీ నటించలేదు. ప్రస్తుతం ఈ అక్కాచెల్లెళ్ళ ఫోకస్ వేరుగా ఉంది.
జాన్వీ కపూర్ మొదట బాలీవుడ్ చిత్రాల్లో నటించి ఇప్పుడు తెలుగు సినిమాలపై ఎక్కువ దృష్టి నిలిపింది. ఇప్పటికే ‘దేవర’ సినిమాలో నటించిన ఈ భామ తాజాగా రామ్ చరణ్ కొత్త సినిమా చేస్తోంది. అలాగే, ‘దేవర 2’ (ఒకవేళ ఉంటే) కూడా ఉంది. ఈ 2025లో మరో రెండు దక్షిణాది చిత్రాలు (ఒకటి తమిళం, ఒకటి తెలుగు) ఆమె ఖాతాలో చేరుతాయని ఆమె పీఆర్ టీం చెప్తోంది.
ఇక ఖుషి కపూర్ తాజాగా అమీర్ ఖాన్ కొడుకు జునైదు ఖాన్ హీరోగా రూపొందుతోన్న కొత్త చిత్రాన్ని సైన్ చేసింది. ఇది తమిళ సూపర్ హిట్ చిత్రం “లవ్ టుడే”కి రీమేక్. సౌత్ నుంచి హిందీలోకి రీమేక్ అయ్యే సినిమాలతో బాలీవుడ్లో బిజీ అవుతోంది ఖుషి.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా అడుగుపెట్టిన ఐదేళ్ల తర్వాత తెలుగులో నటించింది. సో, ఖుషి కూడా మరికొన్నాళ్లు బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకొని సౌత్ లోకి అడుగుపెడుతుంది కాబోలు.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…