నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ తో విశ్వక్ సేన్ నటించిన “లైలా” చిత్రం ఇరుకునపడింది. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ గురించి కొన్ని సెటైర్లు ఉన్నట్లు పృథ్వీ చెప్పారు. దాంతో, ఈ సినిమాపై వైఎస్సార్సపీ సోషల్ మీడియా జనం ట్రోలింగ్ మొదలుపెట్టారు.
ఇప్పుడు ఈ సినిమా టీం నష్టనివారణ చర్యలు చేపట్టింది.
విశ్వక్ సేన్ … నందమూరి బాలకృష్ణకి క్లోజ్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కాంపౌండ్ తనదే అన్నట్లుగా నిరూపించుకునే ప్రయత్నం చేశాడు విశ్వక్ సేన్. జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెడితే, ప్రస్తుతం మెగా కుటుంబం – బాలయ్య ఒకే గూటికి (ఎన్డీయే) చెందినవారు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ సినిమాలో వైఎస్సార్సీ పార్టీపై సెటైర్లు ఉండడం వింతేమీ కాదు.
ఐతే తమ సినిమాకి రాజకీయ రంగు పడొద్దని “లైలా” టీమ్ కోరుకుంటోంది. సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి కామెంట్స్ వచ్చినా ఓకే కానీ రిలీజ్ కి ముందే ఇలాంటి గొడవలు ఎందుకంటీ టీమ్ భావిస్తోందట.
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…