శింగనమల రమేష్ అనే ఓ పాత తరం నిర్మాత చేసిన ఒకే ఒక్క కామెంట్ తో ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్, అటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఏకమయ్యారు. శింగనమలపై విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఆయన ఏం కామెంట్ చేశాడు.?
తన కోర్టు కేసు క్లియర్ అయిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టాడు శింగనమల రమేష్. గతంలో తను తీసిన “ఖలేజా”, “కొమరం పులి” సినిమాలపై స్పందించాడు. ఆ సినిమాల వల్ల తనకు 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చాడు. అప్పట్లోనే కొమరం పులి సినిమాకు మూడేళ్లు టైమ్ పట్టిందని, అదే తన కొంప ముంచిందన్నాడు.
ఈ వ్యాఖ్యల్ని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. బండ్ల గణేశ్ మరో అడుగు ముందుకేశాడు. ఆ సినిమా టైమ్ లో తను ప్రత్యక్ష సాక్షినని, ప్లానింగ్ లేకుండా మూడేళ్లు సినిమా తీసి, పవన్ కు చెందిన అమూల్యమైన వందలాది కాల్షీట్లను నిర్మాత వృధా చేశారని, ఇకనైనా ఇలాంటి విమర్శలు చేయడం ఆపుకోవాలని అన్నాడు.
ఇటు మహేష్ ఫ్యాన్స్ కూడా డ్యూటీ ఎక్కారు. “ఖలేజా” సినిమాను అటుఇటుగా 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా… అంతకుమించి నష్టాలు ఎలా వస్తాయో చెప్పాలని శింగనమలను డిమాండ్ చేస్తున్నారు.
ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…