హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న సమయంలో ఎదురైన ఒక వేధింపుల ఘటన గురించి మాట్లాడింది. ఆ సమయంలో తాను తీవ్ర ఆగ్రహంతో హింసాత్మకంగా ప్రవర్తించాల్సి వచ్చిందని, రోజురోజుకూ పెరిగిపోయిన నిరాశ, కోపం వల్లే అలా చేయాల్సి వచ్చిందని ఆమె అంగీకరించింది.
తన ఇంటికి దగ్గర్లో పదో తరగతి ట్యూషన్ క్లాసులకు వెళ్లేటప్పుడు కొందరు అబ్బాయిలు కాయదును వేధించేవారంట. మొదటి రోజు, రెండో రోజు వారి ప్రవర్తనను పట్టించుకోకుండా వదిలేశానని, కానీ మూడో రోజు మాత్రం వారి వేధింపులను అస్సలు భరించలేకపోయానని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తీవ్ర కోపంతో ఊగిపోతూ, పక్కనే ఉన్న ఒక రాయిని తీసుకుని వారిపైకి విసిరానని.. అది తగిలి ఒకరి తల పగిలిందని, ఆ తర్వాత భయంతో తాను అక్కడి నుంచి వచ్చేశానని బయటపెట్టింది కాయదు.
దాదాపు పదేళ్ల తర్వాత ఈ ఘటనను గుర్తుచేసుకుంటూ. తన ప్రతిస్పందన చాలా తీవ్రమైనదే అయినప్పటికీ, ఆ సమయంలో తాను ఎంతలా అసహాయతను, ఆగ్రహాన్ని అనుభవించానో అది తెలియజేస్తుందని కాయాదు పేర్కొంది.
ఎవరినైనా రాయి విసిరి కొట్టడం కరెక్ట్ కాదని తనకు తెలుసని, కానీ అప్పుడు తనకు అనిపించింది తాను చేశానని అంటోంది.
పైకి చూడటానికి చాలా సైలెంట్గా కనిపించినప్పటికీ.. ఎవరైనా తప్పు చేస్తే చూస్తూ ఊరుకోకూడదని, కచ్చితంగా తిరగబడాలని అంటోంది కాయదు. మహిళలు తమ జీవితాల్లో ఎదుర్కొనే వేధింపులను ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్తో అందరి…