బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు నటీమణులను వెనుకవైపు నుంచి చిత్రీకరించే విధానాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.
అవార్డు వేడుకలో ఫొటోగ్రాఫర్లు తన ఫొటోలు తీస్తుండగా, నేహా ధూపియా వారిని ఉద్దేశించి, “ఈ బ్యాక్ షాట్స్ ఎవరు తీస్తారు? ఇలాంటివి చేయొద్దు. నాతోనే కాదు, ఏ మహిళతోనూ ఇలా చేయకండి” అని స్పష్టంగా చెప్పారు.
ఇటీవల ఇదే అంశంపై పలువురు హీరోయిన్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నటి మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్లు కూడా పాపరాజీ కోరినప్పటికీ వెనక్కి తిరిగి పోజులు ఇవ్వడానికి నిరాకరించారు. మరోవైపు, సమంత మాత్రం ఇటీవల ఓ సినిమా కార్యక్రమంలో పాపరాజీ కోసం వెనుకవైపు తిరిగి సంతోషంగా పోజులిచ్చింది.
అయితే సోనాక్షి సిన్హా, నేహా ధూపియా వంటి నటీమణులు మాత్రం మహిళలను వెనుకవైపు నుంచి చిత్రీకరించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై బాలీవుడ్లో మరోసారి చర్చ మొదలైంది.
ఒకప్పుడు బాలీవుడ్లో ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన నేహా ధూపియా ప్రస్తుతం పాడ్కాస్ట్లకు హోస్ట్గా వ్యవహరిస్తూనే, వెబ్ సిరీస్లు, టీవీ షోల్లో కనిపిస్తున్నారు. తెలుగులో ఆమె “నీతో ఇష్టపడ్డాను” (2002), “విలన్” (2003), “పరమవీర చక్ర” (2011) చిత్రాల్లో నటించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…