రీసెంట్ గా ఒరిస్సాలోని కోరాపుట్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశాడు మహేష్. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా కోసం కథ ప్రకారం, కోరాపుట్ లోని దేవ్ మాలి పర్వతాన్ని ఎంచుకున్నారు.
ఆ పర్వత ప్రాంతంలోనే మహేష్, పృధ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించాడు రాజమౌళి. ఇప్పుడీ సినిమాకు ఉన్న క్రేజ్ ను, మహేష్-రాజమౌళి పాపులారిటీని వాడుకోవాలని భావించింది ఒరిస్సా సర్కారు.
దేవ్ మాలి పర్వతం ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం. దానికి మరింత గుర్తింపుని తీసుకొచ్చేందుకు మహేష్ బాబు సహకారాన్ని కోరింది ఒరిస్సా ప్రభుత్వం. స్వయంగా ఒరిస్సా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిద, లొకేషన్ కు వెళ్లి మహేష్ ను కలిశారు.
ఒరిస్సా పర్యాటక రంగ అభివృద్ధి కోసం మహేష్ ముందుకొచ్చాడు. రాజమౌళితో కలిసి దేవ్ మాలి పర్వతంపై మొక్కలు నాటాడు. దానికి మహేష్ మొక్క అని పేరుపెట్టారు. మహేష్ రాకతో ఈ ప్రాంతం టూరిస్ట్ స్పాట్ గా మారుతుందని, ఒరిస్సా భావిస్తోంది.
సాయిదుర్గతేజ్ పెళ్లి మేటర్ ఇప్పటిది కాదు. సమయం, సందర్భం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు సాయితేజ్ పెళ్లి టాపిక్ తెరపైకి వస్తూనే…
బుల్లితెరపై యాంకర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పేరుకు…
ప్రియదర్శి (Priyadarshi) హీరోగా కొత్త సినిమాలు ఒప్పుకుంటేనే ఉన్నాడు. ఇప్పటికే లీడ్ పాత్రలో కోర్టు, మల్లేశం, బలగం వంటి సినిమాలతో…
ఈ రోజు (జూన్ 21) ఫాదర్స్ డే. సరిగ్గా ఈ రోజే యష్ హీరోగా నటిస్తున్న "టాక్సిక్" (Toxic) సినిమాకి…
'మల్లేశం', 'వకీల్ సాబ్' సినిమాలు చేసినప్పుడు అనన్య (Ananya Nagalla)లో ఈ కోణాన్ని ఎవ్వరూ చూడలేదు. ఇన్నాళ్లూ ఇంత అందాన్ని…
టాలీవుడ్ యంగ్ బ్యూటీ రితికా నాయక్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవలే 'మిరాయి' సినిమాతో…