గత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. డైలీ సీరియల్ టైపులో వారాల పాటు ఇద్దరూ మాటలతో గొడవపడ్డారు. ఒకానొక దశలో హద్దులు దాటి విమర్శలు చేసుకున్నారు.
ప్రకాష్ రాజ్ స్థానికతను మంచు విష్ణు లేవనెత్తగా.. మంచు విష్ణు సినిమాల రికార్డులు, కలెక్షన్లను ప్రకాష్ రాజ్ తక్కువచేసి మాట్లాడారు. ఇప్పుడీ ఇద్దరు మరోసారి మాటల యుద్ధానికి తెరదీశారు.
తిరుమల శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారనే వివాదం నేపథ్యంలో ప్రకాష్ రాజ్ స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఈ విషయాన్ని జాతీయ ఇష్యూ చేయొద్దని, మరిన్ని మత ఘర్షణలు జరిగేలా వ్యవహరించొద్దని కోరారు.
దీనిపై మంచు విష్ణు ఘాటుగా స్పందించాడు. హద్దుల్లో ఉంటే మంచిదని ప్రకాష్ రాజ్ కు సూచించాడు. వివాదంపై పవన్ కల్యాణ్ ఆల్రెడీ సమగ్ర విచారణ కోరారని, మీరు ఈ అంశానికి మతం రంగు పులమొద్దని ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఆ వెంటనే ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. విషయాన్ని తేలికపరుస్తూ, ఎవరి అభిప్రాయం వాళ్లది అనే అర్థం వచ్చేలా ట్వీట్ పెట్టారు. ఇలా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.
ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…