గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కినేని నాగార్జున కుటుంబాన్ని టార్గెట్ చేసింది అనే మాట వినిపిస్తోంది. దానికి తగ్గట్లే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారు. అలాగే, ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొండ సురేఖ ప్రతిపక్ష పార్టీ నేతపై విమర్శలు చేస్తున్నట్లుగా మాట్లాడుతూ నాగార్జున కుటుంబంపై దారుణమైన, అసభ్యకరమైన ఆరోపణలు చేశారు.
ఐతే, ఈ విషయంలో నాగార్జున సైలెంట్ గా ఉండకుండా న్యాయ పోరాటానికి దిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతకన్నా తనని టార్గెట్ చేసేది లేదని ఫిక్స్ అయి గట్టిగా పోరాడేందుకు సిద్ధపడ్డారు.
ఇప్పటికే అమల కొండా సురేఖని ఒక క్రిమినల్ గా అభివర్ణించగా, నాగార్జున కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసు ఇప్పట్లో తేలేది కాదు. కానీ తన భయపడను అని గట్టి సందేశం పంపే ప్రయత్నం చేస్తున్నారు నాగార్జున.
నాగార్జున కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసింది అన్న విషయంలో రాజకీయ విశ్లేషకులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాగార్జునని టార్గెట్ చేసిందా లేదా అన్నది పక్కన పెడితే, నాగార్జున మాత్రం తగ్గేది లేదు అని అంటున్నారు.
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…