గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కినేని నాగార్జున కుటుంబాన్ని టార్గెట్ చేసింది అనే మాట వినిపిస్తోంది. దానికి తగ్గట్లే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారు. అలాగే, ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొండ సురేఖ ప్రతిపక్ష పార్టీ నేతపై విమర్శలు చేస్తున్నట్లుగా మాట్లాడుతూ నాగార్జున కుటుంబంపై దారుణమైన, అసభ్యకరమైన ఆరోపణలు చేశారు.
ఐతే, ఈ విషయంలో నాగార్జున సైలెంట్ గా ఉండకుండా న్యాయ పోరాటానికి దిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతకన్నా తనని టార్గెట్ చేసేది లేదని ఫిక్స్ అయి గట్టిగా పోరాడేందుకు సిద్ధపడ్డారు.
ఇప్పటికే అమల కొండా సురేఖని ఒక క్రిమినల్ గా అభివర్ణించగా, నాగార్జున కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసు ఇప్పట్లో తేలేది కాదు. కానీ తన భయపడను అని గట్టి సందేశం పంపే ప్రయత్నం చేస్తున్నారు నాగార్జున.
నాగార్జున కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసింది అన్న విషయంలో రాజకీయ విశ్లేషకులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాగార్జునని టార్గెట్ చేసిందా లేదా అన్నది పక్కన పెడితే, నాగార్జున మాత్రం తగ్గేది లేదు అని అంటున్నారు.
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…