గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కినేని నాగార్జున కుటుంబాన్ని టార్గెట్ చేసింది అనే మాట వినిపిస్తోంది. దానికి తగ్గట్లే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారు. అలాగే, ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొండ సురేఖ ప్రతిపక్ష పార్టీ నేతపై విమర్శలు చేస్తున్నట్లుగా మాట్లాడుతూ నాగార్జున కుటుంబంపై దారుణమైన, అసభ్యకరమైన ఆరోపణలు చేశారు.
ఐతే, ఈ విషయంలో నాగార్జున సైలెంట్ గా ఉండకుండా న్యాయ పోరాటానికి దిగారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతకన్నా తనని టార్గెట్ చేసేది లేదని ఫిక్స్ అయి గట్టిగా పోరాడేందుకు సిద్ధపడ్డారు.
ఇప్పటికే అమల కొండా సురేఖని ఒక క్రిమినల్ గా అభివర్ణించగా, నాగార్జున కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసు ఇప్పట్లో తేలేది కాదు. కానీ తన భయపడను అని గట్టి సందేశం పంపే ప్రయత్నం చేస్తున్నారు నాగార్జున.
నాగార్జున కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసింది అన్న విషయంలో రాజకీయ విశ్లేషకులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాగార్జునని టార్గెట్ చేసిందా లేదా అన్నది పక్కన పెడితే, నాగార్జున మాత్రం తగ్గేది లేదు అని అంటున్నారు.
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…