ఒడిశా రాష్ట్రంలో తెలుగు సినిమా షూటింగ్ ల సందడి ఎక్కువ అవుతోందట. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాజాగా తెలుగు ఫిలింమేకర్లను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
ఒడిశా ఉప ముఖ్యమంత్రి పార్వతి పరిదా (Pravati Parida) ప్రకారం వాళ్ళ రాష్ట్రంలోని మల్కన్ గిరి ప్రాంతంలో పుష్ప 2 షూటింగ్ జరిగిందట. “ఇప్పుడు రాజమౌళి కోరాపుట్ ప్రాంతంలో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. మా ఒడిశాలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు షూటింగ్ లకు అనువుగా ఉన్నాయి,” అని ఆమె పేర్కొన్నారు.
మల్కన్ గిరి, కోరాపుట్ ఒకప్పుడు నక్సల్స్ ప్రాంతాలు. అందుకే, మనవాళ్ళు షూటింగ్ లకు అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆ ప్రాంతమంతా దట్టమైన అడవి, సరస్సులు, జలపాతాలతో ఉంటుంది. సుందరమైన ప్రదేశమే కానీ నక్సల్స్ కారణంగా ఇంతకుముందు ఎవరూ వెళ్ళలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి.
ఒడిశాలో మరిన్ని పెద్ద సినిమాల షూటింగులు జరుగుతాయా అనేది చూడాలి.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…