నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు. దాంతో ఆయన కన్ఫ్యూజ్ అయి మిగతావాళ్ళని కన్ఫ్యూజ్ చేశారు.
“హరి హర వీర మల్లు” సినిమా మొదటి ప్రెస్ మీట్ ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా ఈవెంట్ లో రఘుబాబు మాట్లాడారు. కీరవాణి గురించి పొగుడుతూ “కృష్ణం వందే జగద్గురుమ్” సినిమా కోసం ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడాను అని చెప్పారు రఘుబాబు. వెంటనే కీరవాణి ఆ సినిమాకి తాను సంగీతం అందించలేదని, మణిశర్మ పాటలు కంపోజ్ చేశారని అయన చెవిలో చెప్పారు.
అయినా రఘుబాబు అక్కడితో ఆపకుండా, “ఐతే వేదం సినిమాలో పాడి ఉంటాను” అని కీరవాణితో అన్నారు. దానికి, “అందులో కూడా పడలేదులే” అని సైగ చేశారు.
మొత్తానికి రఘుబాబు తాను కీరవాణికి ఏ పాట పాడానో, ఏ సినిమాలో గొంతు విప్పానో గుర్తుతెచుకోలేకపోయారు. కీరవాణి కూడా రఘుబాబు మాట్లాడుతున్నప్పుడు అయోమయంగానే కనిపించారు.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని "పెద్ది" సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో…
అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు.…