నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు. దాంతో ఆయన కన్ఫ్యూజ్ అయి మిగతావాళ్ళని కన్ఫ్యూజ్ చేశారు.
“హరి హర వీర మల్లు” సినిమా మొదటి ప్రెస్ మీట్ ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా ఈవెంట్ లో రఘుబాబు మాట్లాడారు. కీరవాణి గురించి పొగుడుతూ “కృష్ణం వందే జగద్గురుమ్” సినిమా కోసం ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడాను అని చెప్పారు రఘుబాబు. వెంటనే కీరవాణి ఆ సినిమాకి తాను సంగీతం అందించలేదని, మణిశర్మ పాటలు కంపోజ్ చేశారని అయన చెవిలో చెప్పారు.
అయినా రఘుబాబు అక్కడితో ఆపకుండా, “ఐతే వేదం సినిమాలో పాడి ఉంటాను” అని కీరవాణితో అన్నారు. దానికి, “అందులో కూడా పడలేదులే” అని సైగ చేశారు.
మొత్తానికి రఘుబాబు తాను కీరవాణికి ఏ పాట పాడానో, ఏ సినిమాలో గొంతు విప్పానో గుర్తుతెచుకోలేకపోయారు. కీరవాణి కూడా రఘుబాబు మాట్లాడుతున్నప్పుడు అయోమయంగానే కనిపించారు.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…