నటుడు రఘుబాబు పాటలు కూడా పాడాడట. కాకపోతే ఎవరి సంగీత దర్శకత్వంలో పాటలు పాడారో ఆయనకే తెలియదు. లేదా మర్చిపోయారు. దాంతో ఆయన కన్ఫ్యూజ్ అయి మిగతావాళ్ళని కన్ఫ్యూజ్ చేశారు.
“హరి హర వీర మల్లు” సినిమా మొదటి ప్రెస్ మీట్ ఈ రోజు హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా ఈవెంట్ లో రఘుబాబు మాట్లాడారు. కీరవాణి గురించి పొగుడుతూ “కృష్ణం వందే జగద్గురుమ్” సినిమా కోసం ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడాను అని చెప్పారు రఘుబాబు. వెంటనే కీరవాణి ఆ సినిమాకి తాను సంగీతం అందించలేదని, మణిశర్మ పాటలు కంపోజ్ చేశారని అయన చెవిలో చెప్పారు.
అయినా రఘుబాబు అక్కడితో ఆపకుండా, “ఐతే వేదం సినిమాలో పాడి ఉంటాను” అని కీరవాణితో అన్నారు. దానికి, “అందులో కూడా పడలేదులే” అని సైగ చేశారు.
మొత్తానికి రఘుబాబు తాను కీరవాణికి ఏ పాట పాడానో, ఏ సినిమాలో గొంతు విప్పానో గుర్తుతెచుకోలేకపోయారు. కీరవాణి కూడా రఘుబాబు మాట్లాడుతున్నప్పుడు అయోమయంగానే కనిపించారు.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…