లావణ్య ఇష్యూతో బాగా డిస్టర్బ్ అయ్యాడు హీరో రాజ్ తరుణ్. కెరీర్ లో తొలిసారి భారీ వివాదాన్ని ఫేస్ చేస్తున్న ఈ హీరో, తన తాజా చిత్రం ప్రమోషన్ కు కూడా దూరమయ్యాడు. ఎక్కడ మీడియాకు ఎదురుపడితే, ఏ ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుందోనంటూ ఆందోళన చెందాడు
అలా రాజ్ తరుణ్ ప్రచారం లేకుండానే గత వారం థియేటర్లలోకి వచ్చింది “పురుషోత్తముడు” అనే సినిమా. ఆ సినిమాని ఎక్కడా ప్రచారం చెయ్యలేదు రాజ్ తరుణ్.
ఇప్పుడు “తిరగబడరా సామీ” ఆగస్టు 2న విడుదల అవుతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆ హీరోయిన్ రాజ్ తరుణ్ ని తగులుకొని తనకు దూరం చేసింది అని రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఆరోపణలు చేసింది. సో ఈ సినిమా కూడా ప్రచారం లేకుండానే రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు.
కానీ రాజ్ తరుణ్ ఈ సినిమా ప్రచారం ప్రారంభించాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కలిసి ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే ఎక్కడా లావణ్య ఇష్యూ తెరపైకి రాకుండా, యాంకర్లు ఆ ప్రశ్నలు అడక్కుండా ఉండాలనే కండిషన్ మీద ఇంటర్వ్యూలు ఇచ్చినట్టున్నాడు.మొత్తానికి వివాదాన్ని టచ్ చేయకుండానే నాలుగు గోడల మధ్య ఇంటర్వ్యూలు ఇస్తూ, సినిమా ప్రచారం కానిస్తున్నాడు రాజ్ తరుణ్. ఇప్పట్లో అతడు నేరుగా మీడియా ముందుకు రాకపోవచ్చు.
“తిరగబడరా సామీ” అనే ఈ సినిమాకి ఎలాంటి హైప్ ఐతే లేదు. మరి ఈ వివాదం ఏమైనా కలిసొస్తుందా అనేది చూడాలి.
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…