లావణ్య ఇష్యూతో బాగా డిస్టర్బ్ అయ్యాడు హీరో రాజ్ తరుణ్. కెరీర్ లో తొలిసారి భారీ వివాదాన్ని ఫేస్ చేస్తున్న ఈ హీరో, తన తాజా చిత్రం ప్రమోషన్ కు కూడా దూరమయ్యాడు. ఎక్కడ మీడియాకు ఎదురుపడితే, ఏ ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుందోనంటూ ఆందోళన చెందాడు
అలా రాజ్ తరుణ్ ప్రచారం లేకుండానే గత వారం థియేటర్లలోకి వచ్చింది “పురుషోత్తముడు” అనే సినిమా. ఆ సినిమాని ఎక్కడా ప్రచారం చెయ్యలేదు రాజ్ తరుణ్.
ఇప్పుడు “తిరగబడరా సామీ” ఆగస్టు 2న విడుదల అవుతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆ హీరోయిన్ రాజ్ తరుణ్ ని తగులుకొని తనకు దూరం చేసింది అని రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఆరోపణలు చేసింది. సో ఈ సినిమా కూడా ప్రచారం లేకుండానే రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు.
కానీ రాజ్ తరుణ్ ఈ సినిమా ప్రచారం ప్రారంభించాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కలిసి ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే ఎక్కడా లావణ్య ఇష్యూ తెరపైకి రాకుండా, యాంకర్లు ఆ ప్రశ్నలు అడక్కుండా ఉండాలనే కండిషన్ మీద ఇంటర్వ్యూలు ఇచ్చినట్టున్నాడు.మొత్తానికి వివాదాన్ని టచ్ చేయకుండానే నాలుగు గోడల మధ్య ఇంటర్వ్యూలు ఇస్తూ, సినిమా ప్రచారం కానిస్తున్నాడు రాజ్ తరుణ్. ఇప్పట్లో అతడు నేరుగా మీడియా ముందుకు రాకపోవచ్చు.
“తిరగబడరా సామీ” అనే ఈ సినిమాకి ఎలాంటి హైప్ ఐతే లేదు. మరి ఈ వివాదం ఏమైనా కలిసొస్తుందా అనేది చూడాలి.
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…
'పెద్ది' (Peddi) సినిమా వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ జాన్వి కపూర్ (Janhvi Kapoor)ను అక్కడక్కడ అభ్యంతరకరంగా…