లావణ్య ఇష్యూతో బాగా డిస్టర్బ్ అయ్యాడు హీరో రాజ్ తరుణ్. కెరీర్ లో తొలిసారి భారీ వివాదాన్ని ఫేస్ చేస్తున్న ఈ హీరో, తన తాజా చిత్రం ప్రమోషన్ కు కూడా దూరమయ్యాడు. ఎక్కడ మీడియాకు ఎదురుపడితే, ఏ ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుందోనంటూ ఆందోళన చెందాడు
అలా రాజ్ తరుణ్ ప్రచారం లేకుండానే గత వారం థియేటర్లలోకి వచ్చింది “పురుషోత్తముడు” అనే సినిమా. ఆ సినిమాని ఎక్కడా ప్రచారం చెయ్యలేదు రాజ్ తరుణ్.
ఇప్పుడు “తిరగబడరా సామీ” ఆగస్టు 2న విడుదల అవుతుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆ హీరోయిన్ రాజ్ తరుణ్ ని తగులుకొని తనకు దూరం చేసింది అని రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఆరోపణలు చేసింది. సో ఈ సినిమా కూడా ప్రచారం లేకుండానే రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు.
కానీ రాజ్ తరుణ్ ఈ సినిమా ప్రచారం ప్రారంభించాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కలిసి ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే ఎక్కడా లావణ్య ఇష్యూ తెరపైకి రాకుండా, యాంకర్లు ఆ ప్రశ్నలు అడక్కుండా ఉండాలనే కండిషన్ మీద ఇంటర్వ్యూలు ఇచ్చినట్టున్నాడు.మొత్తానికి వివాదాన్ని టచ్ చేయకుండానే నాలుగు గోడల మధ్య ఇంటర్వ్యూలు ఇస్తూ, సినిమా ప్రచారం కానిస్తున్నాడు రాజ్ తరుణ్. ఇప్పట్లో అతడు నేరుగా మీడియా ముందుకు రాకపోవచ్చు.
“తిరగబడరా సామీ” అనే ఈ సినిమాకి ఎలాంటి హైప్ ఐతే లేదు. మరి ఈ వివాదం ఏమైనా కలిసొస్తుందా అనేది చూడాలి.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…