శర్వానంద్ తాజా చిత్రం “మనమే.” ఈ సినిమాలో శర్వా సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. తాజాగా ట్రయిలర్ రిలీజైంది. అందులో హీరోహీరోయిన్ల గిల్లికజ్జాల్ని చూపించారు. పరస్పరం విరుద్ధ భావాలు, ఆలోచన విధానం కలిగిన కపుల్ గా శర్వా-కృతి కనిపించారు.
ఈ సందర్భంగా ఓ కొత్త సెంటిమెంట్ ను తెరపైకి తీసుకొచ్చాడు శర్వానంద్.
హీరోహీరోయిన్లు తిట్టుకుంటే సినిమాసూపర్ హిట్టు అవుతుందట. రెండు సినిమాల్ని కూడా ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. మురారి, ఖుషి సినిమాల్లో హీరోహీరోయిన్లు ఒకర్నొకరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఆ ఘర్షణ నుంచే ఓ మేజిక్ మూమెంట్ పుట్టుకొస్తుంది. అదే మేజిక్ ‘మనమే’ సినిమాకు కూడా వర్కవుట్ అవుతుందంటున్నాడు శర్వా.
శ్రీరామ్ ఆదిత్య డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అతడి కొడుకు కీలక పాత్ర చేశాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు హేషమ్ సంగీతం అందించాడు. 7వ తేదీన థియేటర్లలోకి వస్తోంది మరి శర్వానంద్ చెప్తున్న తిట్టు సెంటిమెంట్ వర్క్ అవుతుందా?
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని "పెద్ది" సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో…
అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు.…