ప్రభాస్ హీరోగా తెరకెక్కిన “కల్కి 2898 AD” సీక్వెల్కి సంబంధించిన పనులు సైలెంట్గా కొనసాగుతున్నాయి. ‘కల్కి 2’ (Kalki 2)షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభాస్ ఇంకా షూటింగ్లో పాల్గొనలేదు. కానీ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తమ పాత్రలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను పూర్తి చేశారు.
ఇక ఈ సీక్వెల్లో కీలక మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. మొదటి భాగంలో నటించిన దీపిక పదుకొణే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంది. ఆమె మొదటి భాగంలో సుమతి అనే పాత్రలో నటించింది. ఆమె స్థానంలో సాయి పల్లవి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో క్లైమాక్స్లో వచ్చే ఒక స్పెషల్ రోల్ కోసం తమిళ హీరో శింబు (Simbu) పేరు వినిపిస్తోంది. ఈ పాత్ర సినిమాకి కీలకమైందిగా ఉంటుందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్ నిర్మాణం జరుగుతోందని సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2028లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…