తెలుగు ప్రేక్షకులకు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు బంపరాఫర్ ఇచ్చారు. ఇకపై తమ థియేటర్లలో ఏ సినిమాకూ టికెట్ రేట్ల (Ticket Rates) పెంపు ఉండదని ప్రకటించారు. అయితే ఇక్కడో చిన్న మెలిక. సింగిల్ స్క్రీన్స్ కు కూడా మల్టీప్లెక్సుల తరహాలో పర్సంటేజీ విధానాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.
పర్సంటేజీ విధానం అమలు చేసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఏ సింగిల్ స్క్రీన్ లో, ఎంత పెద్ద సినిమా రిలీజైనా, టికెట్ రేట్లు పెంచమని నిర్మాత-డిస్ట్రిబ్యూటర్ శిరీశ్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక జీవోలు జారీ చేసినా, సింగిల్ స్క్రీన్స్ లో సాధారణ టికెట్ రేట్లకే సినిమాను ప్రదర్శిస్తామంటున్నారాయన.
మల్టీప్లెక్సుల తరహాలో సింగిల్ స్క్రీన్స్ కు కూడా పర్సంటేజీ విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు ఎగ్జిబిటర్లు. తమకు కూడా పర్సంటేజీలిస్తే, సింగిల్ స్క్రీన్స్ లో సౌకర్యాల్ని మెరుగుపరుస్తామని, డాల్బీ-డీటీఎస్ లాంటి టెక్నాలజీల్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు.
‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ టైమ్ లో చేసిన ఆందోళనకు, ప్రస్తుతం ‘పెద్ది’ (Peddi) సినిమా రిలీజ్ టైమ్ లో మళ్లీ మొదలైన వివాదానికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు ఎగ్జిబిటర్లు. తాము ఏళ్లుగా పర్సంటేజీ విధానం కోరుతున్నామని, ఈ గ్యాప్ లో చాలా పెద్ద సినిమాలొచ్చాయని చెబుతున్నారు.
తెలుగులో పెద్దరికం, అమ్మ కొడుకు వంటి సినిమాల్లో నటించిన సుకన్య (Sukanya) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. 1990లలో ఆమె పాపులర్…
'పెద్ది' (Peddi) వివాదాన్ని క్యాష్ చేసుకోవాలని చాలామంది హీరోయిన్లు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. డింపుల్ హయాతీ నుంచి మొదలుపెడితే, నిత్యామీనన్ వరకు…
వృత్తిగతంగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ మధ్య ఉన్న పోటీ గురించి అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా వీళ్లిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం…
జగపతి బాబు (Jagapathi Babu) హీరోగా ఎంత సక్సెస్ అయ్యారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా అంతే…
కంగన రనౌత్ (Kangana Ranaut) మన దేశంలో పనిచేస్తున్న నర్సుల దుస్తులపై విమర్శలు చేసింది. బ్రిటిష్ కాలంలో నర్సులకు ఈ…
ఓవైపు జాన్వి కపూర్ ను అసభ్యంగా చూపించారని, సౌత్ సినిమాలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్ నడుస్తున్న వేళ.. దక్షిణాది…