జోరుగా ‘ఆదిపురుష్’ అమ్మకాలు

Adipurush

‘ఆదిపురుష్’ బిజినెస్ జోరుగా సాగుతోంది. టి.సిరీస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా తెలుగు హక్కులు యువి క్రియేషన్స్ కి ఉన్నాయి. యువి సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి 160 కోట్లకు అమ్మింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టర్ డిస్ట్రిబ్యూషన్ లో లేదు. కేవలం నిర్మాణ సంస్థ. కాకపోతే, ప్రభాస్ తో ఇప్పుడు ఆ సంస్థ రెండు చిత్రాలు నిర్మిస్తోంది. ఆ స్నేహంతో ‘ఆదిపురుష్’ తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు 160 కోట్లకు తీసుకొంది.

ఇక తాజాగా ఆంధ్ర, నైజాం హక్కులు అమ్మింది ఆ సంస్థ. ఇటీవలే డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టిన మైత్రి సంస్థ నైజాం హక్కులను దాదాపు 60 కోట్లకు తీసుకొంది. ఆంధ్రలో వైజాగ్ ఇంకా కొన్ని ప్రాంతాలు బిజినెస్ క్లోజ్ కాలేదు. మొత్తంమీద 150 కోట్ల వరకు విడుదలకు ముందే బిజినెస్ అవుతోంది. అంటే, 10 కోట్లు విడుదల తర్వాత చూసుకోవాలి పీపుల్స్ సంస్థ.

‘ఆదిపురుష్’కి ఇంతకుముందు నెగెటివ్ ఇమేజ్ ఉండేది. కానీ ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే, ఈ రేంజ్ వ్యాపారం జరిగింది.

ప్రభాస్ సినిమాలకు తెలుగునాట ఏ సినిమాకైనా 130 నుంచి 140 కోట్ల వ్యాపారం మినిమమ్ జరిగేలా ఉంది. అది ఆయన స్టేమినా.

Advertisement
 

More

Related Stories