అలియాని భయపెట్టించిన మీడియా

Alia Bhatt

“ఆర్ ఆర్ ఆర్” సినిమాలో అలియా భట్ ప్రధాన కథానాయిక. రామ్ చరణ్ సరసన పాత్ర. సీతగా నటించిన అలియా భట్ కి ఈ సినిమాలో దక్కిన నిడివి చాలా తక్కువ. విడుదలకు ముందే ఈ సినిమాలో ‘రొమాన్స్ ఉండదు బ్రోమాన్స్’ ఉంటుంది అని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. దానికి తగ్గట్లే సినిమాలో అలియా భట్ పాత్ర చాలా తక్కువ సేపు కనిపించింది.

ఐతే, సినిమా విడుదలైన తర్వాత ఆమె ఒక్క ట్వీట్ పోస్ట్ చెయ్యకపోవడం, ఇన్ స్టాగ్రామ్ లో కూడా స్పందించకపోవడంతో పుకార్లు మొదలయ్యాయి. ఆమె అలిగిందని, తన పాత్రని తగ్గించారని రాజమౌళిపై కోపం పెంచుకుందని , ఏవేవో ఒక వర్గం మీడియా వార్తలు రాసింది. ఆమె రాజమౌళిని అన్ ఫాలో కొట్టిందని కొన్ని మీడియా సంస్థలు రాశాయి.

మొదట్లో ఈ రూమర్స్ ని పట్టించుకోలేదు అలియా. కానీ ఇప్పుడు స్పందించక తప్పని పరిస్థితి వచ్చింది. దాంతో, ఆమె సుదీర్ఘ లేఖ రాశారు. రాజమౌళి డైరెక్షన్లో నటించడం, తారక్, చరణ్ తో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేనని ఆ లేఖలో రాశారు అలియా.

ఆమె భయపడి స్పందించేలా చేసింది మీడియా. నిజానికి ఆమె, ఆమె కాబోయే భర్త రణబీర్ కపూర్ కలిసి నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రానికి రాజమౌళి ప్రెజెంటర్. మరి అలాంటప్పుడు రాజమౌళితో గొడవ పెట్టుకునే సాహసం అలియా ఎందుకు చేస్తుంది? ఈ విషయాన్ని మీడియా విస్మరించి వార్తలు రాసింది.

నిజానికి ఆమె ఒక్క ట్వీట్ డిలీట్ చెయ్యలేదు, రాజమౌళిని అన్ ఫాలో కూడా కొట్టలేదు. ఆమె ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ తర్వాత ఆ సినిమా గురించి పెద్దగా స్పందించలేదు. అంతే. అంతకుమించి ఆమె ఏమి చెయ్యలేదు.

Advertisement
 

More

Related Stories