Advertisement
తెలుగు న్యూస్

కంగనాకి కోర్టులో విజయం

కంగనా రనౌత్ గెలిచింది. ఆమె ఆఫీస్ ముందు ఉన్న కట్టడాలను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూల్చింది. శివసేన ప్రభుత్వంపై కంగనా విమర్శలు గుప్పించడంతో బదులుగా ఆమె బిల్డింగ్ ముందు స్ట్రక్చర్ ని కూల్చారు. దీనిపై ఆమె కోర్టుకెక్కారు. బాంబే హైకోర్టు మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయాన్ని తప్పు పట్టింది. కంగనా ఆ కట్టడాలను రెగ్యూలరైజ్ చేసుకోవచ్చని తెలిపింది.

పౌరుల హక్కులకు భంగం కలిగిస్తూ చట్టాన్ని తప్పుగా అన్వహిస్తూ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రవర్తించింది అని హైకోర్టు తప్పు పట్టింది. శివసేన ప్రభుత్వం కక్ష తీర్చుకోవడం కోసమే ఇలా చేసింది అని అనడంలో సందేహం లేదు. మొత్తానికి ఈ కేసులో కంగనాకు విజయం లభించింది. నష్ట పరిహారం కూడా కార్పొరేషన్ చెల్లించాలని కోర్టు తెలపడం ఆమెకి పెద్ద ఊరట.

అలాగే, కంగనా తన నోటి దురుసుతనాన్ని తగ్గించుకోవాలని కూడా కోర్టు సూచించడం విశేషం.

Advertisement

This post was last modified on November 27, 2020 12:38 pm

Advertisement
Share