కేసీఆర్ ని పరామర్శించిన మెగాస్టార్

- Advertisement -
KCR with Chiranjeevi

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. ఇటీవల కేసీఆర్ తుంటికి శస్త్ర చికిత్స జరిగింది. తన నివాసంలో జారి పడడంతో హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేశారు యశోద ఆసుపత్రి డాక్టర్లు.

ఇప్పటికే తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేసీఆర్ ని పరామర్శించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజు ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య స్థితిని స్వయంగా తెలుసుకున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా వెళ్లి కేసీఆర్ ని పరామర్శించారు. కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారని చిరంజీవి చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మంచి గౌరవం ఇచ్చారు.

More

Related Stories