తుపానులో చిక్కుకున్న టాలీవుడ్ హీరో

ప్రస్తుతం తమిళనాడుతో పాటు పాండిచ్చేరిని నివర్ తుపాను వణికిస్తోంది. పాండిచ్చేరికి 200 కిలోమీటర్ల దూరంలో తుపానుగా బలపడింది. దీంతో అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో హీరో విశ్వక్ సేన్ పాండిచ్చేరిలో ఇరుక్కుపోయాడు.

“పాగల్” అనే తన కొత్త సినిమా షూటింగ్ కోసం కొన్ని రోజుల కిందట పాండిచ్చేరి వెళ్లాడు విశ్వక్ సేన్. కొన్ని రోజుల పాటు షూటింగ్ బాగానే సాగింది. అంతలోనే వర్షాలు, తుపాను మొదలుకావడంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు.

అయితే తుపాను వల్ల షూటింగ్ ఆగిపోయినా, విశ్వక్ మాత్రం తన జోష్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ ఫ్రీ టైమ్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. పాండీ వీధుల్లో నడుస్తూ, ఐస్ క్రీమ్ తింటూ ఫొటోలు పోస్ట్ చేస్తున్నాడు. అంతేకాదు..తన రూమ్ కు దగ్గర్లో ఉన్న కొలనులో చేపలకు ఆహారం తినిపిస్తూ ఎంచక్కా ఈ ఫ్రీ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

Advertisement
 

More

Related Stories