బిగ్ బాస్ కి ఆడోళ్ళు నచ్చరా?

Bigg Boss Telugu 5


ఈసారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్ లతో మొదలైంది బిగ్ బాస్. కానీ ఫిమేల్ కంటెస్టెంట్లు తక్కువగానే వచ్చారు. విచిత్రంగా ఈసారి ముందుగా ఎలిమినేట్ అవుతోంది కూడా వాళ్లే. ఇప్పటికే ఐదుగురు ఫిమేల్ కంటెస్టెంట్లు బయటికి వచ్చారు. తాజాగా ‘మిర్చి’ ప్రియా కూడా ఎలిమినేట్ అయిందట. అంటే ఆరో భామ కూడా అవుట్.

లహరి, హమీద, ఉమాదేవి, శ్వేత వర్మ, సరయు, ప్రియా… ఇలా వరుసగా ఆడోల్లని బయటికి పంపిస్తున్నాడు బిగ్ బాస్. దాంతో హౌస్ లో గ్లామర్ తగ్గిపోతోంది.

ప్రస్తుతం హౌస్ లో కాజల్, అని, సిరి, ప్రియాంక సింగ్ మాత్రమే ఫిమేల్ కంటెస్టెంట్లు. ఆట ఇంకా 50 రోజులకిపైనే ఉంది. అప్పుడే ఆరుగురు ఆడోళ్లని బయటికి పంపి మగాళ్ల షోగా మార్చేస్తారా అని ఫిమేల్స్ కోసమే బిగ్ బాస్ షో చేసే కుర్రాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

మరి మరింత గ్లామర్ కోసం కొత్త కంటెస్టెంట్ లను వైల్డ్ కార్డు ద్వారా దింపుతారా అన్నది చూడాలి.

Advertisement
 

More

Related Stories