రెండు నెలల తర్వాత’ గుంటూరు కారం’

Guntur Kaaram

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ… గుంటూరు కారం. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 6న ఆగింది. రెండు నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ షూటింగ్ షురూ కానుంది. జూన్ 10న కానీ, జూన్ 12న కానీ షూటింగ్ ప్రారంభిస్తారు.

ఈ సినిమా షూటింగ్ విషయంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చిన మాట నిజం. అందుకే, ఏప్రిల్ 6 నుంచి ఇప్పటివరకు షూటింగ్ జరగలేదు. కథలో సీన్స్ కి అనుగుణంగా (సీనిక్ ఆర్డర్) షూటింగ్ జరగాలనేది మహేష్ బాబు ఆలోచన. ఈ విషయంలో తర్జన భర్జన తర్వాత ఇప్పుడు షూటింగ్ కి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఇద్దరు హీరోయిన్ల చిత్రమిది. తమన్ సంగీతం అందిస్తున్నారు.

వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది ‘గుంటూరు కారం’. అమరావతి సమీపంలోని ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ నడుస్తుంది. ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు మాస్ మూమెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయట. ఇటీవల విడుదలైన టైటిల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు బాగా ఖుషి అయ్యారు. ఇక ఈ సినిమా మొదటి పాట ఆగస్టు 9న విడుదల కానుంది.

Advertisement
 

More

Related Stories